Best Web Hosting Provider In India 2024
Crime news : స్కూల్ వాష్రూమ్లో దారుణం! 8ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశారా?
Karnataka crime news : స్కూల్ బాత్రూమ్లో తనపై ఇద్దరు అబ్బాయిలు లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ 8ఏళ్ల బ బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు.
కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! స్కూల్ వాష్రూమ్లో తన 8ఏళ్ల కూతురిపై లైంగిక దాడి జరిగిందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగింది..?
కర్ణాటక మాండ్యా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జనవరి 31న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. స్కూల్ వాష్రూమ్లో 8ఏళ్ల బాలికపై ఇద్దరు అబ్బాయిలు లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. తొలుత ఈ విషయాన్ని బాలిక ఎవరికి చెప్పలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని వారు బెదిరించడంతో మౌనంగా ఉండిపోయింది. కానీ ఆదివారం, ఈ విషయాన్ని ఆమె తన తల్లికి చెప్పింది. ఆ మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయించింది.
ఈ విషయంపై పోలీసులు మీడియాకు కొన్ని వివరాలను వెల్లడించారు.
“బాలికపై లైంగిక దాడి జరిగిందని ఆమె తల్లి చెబుతోంది. రెండొవ తరగతి చదువుకుంటున్న బాలికను ఇద్దరు అబ్బాయిలు బాత్రూమ్లోకి తీసుకెళ్లి, బట్టలు తీసేయాలని బెదిరిచినట్టు ఆ మహిళ పేర్కొంది. అనంతరం వారు ఆమెను, ఆమె ప్రైవేటు భాగాలను కొట్టారని ఆ మహిళ వెల్లడించింది,” అని పోలీసులు తెలిపారు.
ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు బాలిక క్లాస్మేట్. మరొ వ్యక్తి వేరే క్లాస్లో చదువుకుంటున్నాడు.
పోలీసులు బాలిక స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అనంతరం నిందితులపై పోక్సో చట్టం కింద కేసు వేసి దర్యాప్తు చేపట్టారు. నిజానిజాలను ధ్రువీకరించేందుకు దర్యాప్తు జరుగుతోందని మాండ్యా ఎస్పీ మల్లిఖార్జున్ బలదండి తెలిపారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు స్కూల్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.
అయితే, బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, కానీ ఆమె ప్రైవేటు భాగాలపై గాయాలేవీ కనిపించలేదని రిపోర్టు చెబుతోందని పోలీసులు అన్నారు. నిందితులుగా ఉన్న అబ్బాయిల స్టేట్మెంట్ కూడా తీసుకుంటామని, ఆ తర్వాత తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
“ప్రస్తుతానికి బాలిక స్టేట్మెంట్ ఆధారంగా కేసులో దర్యాప్తు చేస్తున్నాము. ఆమె చెప్పే మాటల్లో కాస్త గందరగోళం ఉంది,” అని పోలీసులు వెల్లడించారు.
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
“రాష్ట్రంలో మైనర్లపై రేప్, మహిళలపై లైంగిక దాడులు, దోపిడీ ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగ్గాలేవు,” అని బీవై విజయేంద్ర ట్వీట్ చేశారు. తాజా ఘటనపై దర్యాప్తు చేపట్టి దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link