Best Web Hosting Provider In India 2024
Delhi assembly polls: ‘ఢిల్లీ’ పీఠం బీజేపీదే.. ఆప్ కు నిరాశే: ఎగ్జిట్ పోల్స్ అంచనా
Delhi assembly elections exit polls: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ పై బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్ ఆశలు ఈ సారి కూడా నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.
Delhi assembly elections exit polls: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్ కంటే బీజేపీదే పైచేయి అవుతుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 8న కౌంటింగ్ అనంతరం ఎన్నికల సంఘం అధికారిక ఫలితాలను ప్రకటించనుంది. ఓటు వేసిన తర్వాత ఓటర్లు బయటకు వచ్చినప్పుడు వారి ఇంటర్వ్యూల ఆధారంగా ఎన్నికల సర్వే సంస్థలు చేసే అంచనాలను ఎగ్జిట్ పోల్స్ అంటారు. ఇవి వాస్తవ ఫలితాల నుండి విస్తృతంగా మారవచ్చు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
- 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 35 నుంచి 40 సీట్లు, ఆప్ కు 32 నుంచి 37 సీట్లు వస్తాయని మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు 0-1 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది.
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు 51 నుంచి 60 సీట్లు వస్తాయని, ఆప్ కు 10-19 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోతుందని పేర్కొంది.
- పీపుల్స్ ఇన్ సైట్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 40 నుంచి 44 సీట్లు, ఆప్ కు 25 నుంచి 29 సీట్లు, కాంగ్రెస్ కు 0-1 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
- పి-మార్క్ ఎగ్జిట్ పోల్ బీజేపీకి 39-49 సీట్లు, ఆప్ కు 21-31 సీట్లు, కాంగ్రెస్ కు 0-1 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
- బీజేపీకి 39-45, ఆప్ కు 22-31, కాంగ్రెస్ కు 0-2 సీట్లు వస్తాయని జేవీసీ ఎగ్జిట్ పోల్ తెలిపింది.
ఫిబ్రవరి 8న ఫలితాలు
70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ మార్కు 36. ప్రస్తుతం ఆప్ కు 62 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు ఒక్కరు కూడా లేరు. ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం ఎన్నికలు జరగ్గా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీలో 1.55 కోట్ల మంది ఓటర్లు ఉండగా, బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 58 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link