Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/1738925065_184_bhumana.jpg)
పెద్దిరెడ్డిపై పడి ఏడ్వడటం ఈనాడుకు అలవాటు
వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి
తిరుపతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చాలని కూటమి సర్కార్ కుట్రలు చేస్తోందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. వైయస్ఆర్సీపీలో కీలక నాయకుడిగా ఉన్న పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఈనాడు పత్రిక పనిగట్టుకుని విషం చిమ్ముతోందని ఆయన ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పడి ఏడ్వటం ఈనాడుకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలను భూమన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
విషం చిమ్ముతున్నారు:
డి.పట్టాభూములు, ప్రీహోల్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ తప్పుడు కథనాలు రాయడం ఈనాడు పత్రిక పనిగా పెట్టుకుందని భూమన కరుణాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు నెలల క్రితం మదనపల్లి సబ్కలెక్టర్ కార్యాలయంలో తగలబెట్టారు అంటూ ప్రచురించిన ఈనాడు.. ఇప్పుడు తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విషం చిమ్ముతున్నారన్నారు. పచ్చి అబద్ధాలతో కూడిన వార్తలు రాస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు బాకా ఊదడం కోసమే పార్టీ పత్రికగా ఈనాడు మిగిలిపోయిందని భూమన విమర్శించారు.
పెద్దిరెడ్డి కడిగిన ముత్యం:
‘ఈ కేసు విషయంలో డీజీపీని మదనపల్లెకు పంపించి మరీ విచారణ జరిపించారు. నివేదిక ఇచ్చారు. ఈనాడు మళ్లీ బురద చల్లడానికే ఈ వార్తలు ప్రచురిస్తున్నారు. ఫైల్స్ దహనం కేసులో ఏ సంబంధం లేకపోయినా పనికట్టుకుని ఇరికించాలని చూస్తోంది. ప్రజాధరణ కల్గిన నాయకుడు కనుక ఆయన్ని బద్నాం చేయాలని చూస్తోంది. వైయస్ఆర్సీపీని బలహీన పర్చాలని కుట్రలు చేస్తున్నారు. ఆయన ఏ తప్పు చేయలేదని ప్రజలు అందరికీ తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడిగిన ముత్యం. ఎన్ని విచారణలు చేసినా, చేయించినా ఏ తప్పు చేయలేదన్నదే తేలుతుంది’ అని భూమన స్పష్టం చేశారు.