ఉద్యోగుల క‌డుపు కొడుతున్న చంద్రబాబు

Best Web Hosting Provider In India 2024

సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు

ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్‌రెడ్డి

తాడేప‌ల్లి :  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉద్యోగుల క‌డుపు కొడుతున్నార‌ని ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్‌రెడ్డి మండిప‌డ్డారు. గత ప్రభుత్వంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన సచివాలయ వ్యవస్థను ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వీర్యం చేశారని విమర్శించారు.  వాలంటీర్లకు రూ. 10 వేలు ఇస్తామని కూడా మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మోసంతో వాలంటీర్లు రోడ్డున పడ్డారని, సంపద సృష్టించటం అంటే ఉద్యోగుల నోళ్లు కొట్టడమేనా? అని ఆయన ప్రశ్నించారు. శుక్ర‌వారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘సంప‌ద అంటే ఉద్యోగుల‌కు రాయితీలు ఇస్తారేమె అనుకొని అందరూ న‌మ్మి ఓట్లు వేశారు.గెలిచిన త‌రువాత ఉద్యోగులతో అవ‌స‌రం లేద‌నేట్టుగా వ్యవహరిస్తున్నారు. జీవో ఎంఎస్ నెంబ‌ర్ 1ని జ‌న‌వ‌రి 25న రిలీజ్ చేశారు.అందులో గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్ద‌లో ప‌ని చేస్తున్న ల‌క్షా 27వేల 175 మందిలో  ల‌క్ష 15వేల వ‌ర‌కు స‌రిపోతారని చెప్పారు. మిగిలిన 15,490మంది స‌ర్ ప్ల‌స్ అని  పేర్కొనడం  దారుణం. స‌చివాల‌యాల్లో ఉద్యోగుల‌ను ఏ,బీ, సీ గ్రేడ్ లుగా విభ‌జించ‌టం ఏంటి?, ఇదంతా ఏదో దురుద్దేశంతో చేస్తున్నార‌నే అనుమానం కులుగుతోంది.

ఎవ్వ‌రితో మాట్లాడ‌కుండా జీవోలు ఎలా‌ ఇస్తారు?, ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఖండిస్తున్నాం.ఉద్యోగుల్లో గంద‌ర‌గోళం సృస్టిస్తున్నారు.ఇన్ని రోజులు ఉద్యోగుల‌కు ఉన్న ఎక్స్ పీరియ‌న్స్ పోతుంది.మాక‌డుపు కొడుతున్నార‌ంటూ ఉద్యోగులంతా బాధ ప‌డుతున్నారు.ఉద్యోగుల‌ను మోసం చేస్తే స‌ర్ణాంధ్ర ఎలా అవుతుంది?,వెంట‌నే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి’ అని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

Best Web Hosting Provider In India 2024