




Best Web Hosting Provider In India 2024

Tirumala News : ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త – వీఐపీ బ్రేక్ దర్శనం కోటా పెంపు..!
ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) సభ్యులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రోజువారీగా అందిస్తున్న వీఐపీ బ్రేక్ దర్శన కోటాను 50 నుంచి 100కు పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త
ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ఉండే వీఐపీ బ్రేక్ దర్శన కోటాపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కోటాను రెట్టింపు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) సభ్యులకు ప్రస్తుతం రోజువారీగా వీఐపీ బ్రేక్ దర్శన కోటా కింద 50 టికెట్లను ఇస్తున్నారు. అయితే ఈ కోటాను 100 పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
టీటీడీ నిర్ణయం ఫలితంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే పలువురు ప్రవాస భారతీయులకు దర్శనం విషయంలో మరికొంత వెసులుబాటు కలగనుంది. ఎన్నారై భక్తుల డిమాండ్ దృష్ట్యా ఈ కోటాను టీటీడీ పెంచింది. ఈ కోటా కింద ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుల్లోనూ వృద్ధులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
టాపిక్
Nri News Usa TeluguNri NewsTtdTirupatiDevotionalDevotional News
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.