




Best Web Hosting Provider In India 2024

Jabalpur Accident: కుంభమేళా తిరుగు ప్రయాణంలో ఘోర రోడ్డు ప్రమాదం.. జబల్పూర్లో ఏపీకి చెందిన ఏడుగురు దుర్మరణం…
Jabalpur Accident: కుంభమేళా నుంచి ఆంధ్రప్రదేశ్కు తిరుగు ప్రయాణంలో ఉన్న టూరిస్ట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సిహోరా సమీపంలో వంతెనపై టూరిస్ట్ బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు.
Jabalpur Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న టూరిస్ట్ బస్సును భారీ ట్రక్కు ఢీకొట్టడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో మంగళవారం ఉదయం 9.15కు ఈ ప్రమాదం జరిగింది. 30వ నంబరు జాతీయ రహదారిపై సిహోరా వద్ద వంతెనపై ఎదురెదురుగా ఢీకొనడంతో టెంపో ట్రావెలర్ బస్సు నుజ్జయ్యింది. ట్రావెల్ బస్సులో ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాగరాజ్ వెళ్లి తిరిగి వస్తుండగా జబల్పూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన స్థలానికి జబల్పూర్ ఎస్పీ, కలెక్టర్ చేరుకున్నారు.

జబల్పూర్-ప్రయాగ్ రాజ్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్స్ మినీ బస్సు ఎదురుగా వస్తున్న సిమెంట్ నిండిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్లోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. వంతెన మధ్యలో వాహనాలు ఇరుక్కుపోవడంతో వాటిని తొలగించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత కథనం
టాపిక్