Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/syamala.jpg)
ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న వారు ఎక్కడా?
కిరణ్ రాయల్ ను కాపాడుకునేందుకు జనసేన తంటాలు
వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఫైర్
అన్యాయంపై ప్రశ్నించిన ఆడబిడ్డపై కక్షసాధింపులు
కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిపై వేధింపులు
3 రోజులకు ముందే జైపూర్ పోలీసులు వస్తారని ఎలా చెబుతారు?
కిరణ్ రాయల్ ప్లాన్ చేసి జైపూర్ పోలీసులను పిలిపించారు
జనసేన సభలకు లక్ష్మి డబ్బును వాడినందుకే ప్రభుత్వం స్పందించడం లేదా?
ఈ రాష్ట్రంలో అన్యాయంపై ఎవరూ మాట్లాడకూడదనేదే వారి లక్ష్యం
వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆగ్రహం
తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తనను మోసం చేశారంటూ లక్ష్మి అనే మహిళ కన్నీటితో విలపిస్తుంటే కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. లక్ష్మి నుంచి తీసుకున్న డబ్బుతోనే జనసేన సభలను కిరణ్ రాయల్ నిర్వహించడం వల్లే జనసేన నాయకత్వం ఈ విషయంలో అతడికి అండగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానన్న వారు ఎక్కడున్నారని నిలదీశారు.
శ్యామల ఇంకా ఎమన్నారంటే…
జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ చార్జి కిరణ్ రాయల్ వల్ల తనకు అన్యాయం జరిగిందని లక్ష్మి అనే మహిళ కన్నీటితో న్యాయం కోసం కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంది. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా తాను అక్కడ ఉంటాను అని చాటుకునే డిప్యూటీ సీఎం తమ పార్టీ నాయకుడు చేసిన అన్యాయంపై స్పందిస్తారని ఆశ పెట్టుకుంది. ఆమెకు న్యాయం జరగకపోగా కిరణ్ రాయల్ తన పలుకుబడిని ఉపయోగించి జైపూర్ నుంచి పోలీసులను దింపి బాధిత మహిళను జైలుకు పంపడం విస్మయం కలిగిస్తోంది. అసలు ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. కోటిరూపాయలకు పైగా నగదు, బంగారంను తీసుకుని జనసేన పార్టీ కార్యకలాపాలను కిరణ్ రాయల్ వినియోగించారని, తాను జనసేన నుంచి పోటీ చేసి గెలుస్తాను, తిరిగి ఆ సొమ్మును చెల్లిస్తానంటూ బాధిత లక్ష్మిని నమ్మించి మోసం చేసిన వైనంను బాధితురాలు కన్నీటితో మీడియా ముందు వెల్లడించడం రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్నిసార్లు తన సొమ్ము కోసం అడిగినా కిరణ్ రాయల్ స్పందించకపోగా, బాధితురాలిపైనే దౌర్జన్యం చేయడంతో దిక్కులేక న్యాయం కోసం పోలీసులను లక్ష్మి ఆశ్రయించింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందునే కిరణ్ రాయల్ పై కనీసం పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకునేందుకు నిరాకరించారు. ఇదేనా కూటమి పాలనలో బాధితులకు జరిగే న్యాయం? ఆడబిడ్డలకు అండగా ఉంటాను అంటూ ఆవేశంతో ప్రసంగాలు చేసిన వారు తనకు న్యాయం చేస్తారని నమ్మిన లక్ష్మి మీడియా ద్వారా జరిగిన విషయాన్ని వెల్లడిస్తే, ఆమెకు న్యాయం చేయకపోగా ఏకంగా జైలుకు పంపినా ఎందకు మౌనంగా ఉన్నారు?
అన్యాయంపై ప్రశ్నిస్తే వేధింపులు
జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మూడు రోజుల ముందే లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ జోస్యం చెప్పడం, బాధితురాలు మీడియా ముందుకు వచ్చిన వెంటనే జైపూర్ పోలీసులు హటాత్తుగా ఊడిపడి ఆమెను అరెస్ట్ చేయడం చూస్తే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారనే విషయం అర్థమవుతోంది. అంటే కూటమి నేతలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా లక్ష్మికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించడానికే ఇదంతా చేశారు. మహిళలకు అన్నగా నిలబడతాను అంటూ బీరాలు పలికిన వారికి ఈరోజు తిరుపతిలో లక్ష్మి కారుస్తున్న కన్నీరు కనిపించడం లేదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయి. మహిళా హోం మినిస్టర్ అనిత ప్రచారానికి, ఆర్భాటాలకే తప్ప మహిళల రక్షణపై ఎటువంటి దృష్టి సారించలేదు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం చేయాలనే ఆలోచన వచ్చినా ఆ రోజే వారికి ఆఖరి రోజు అంటూ చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. కానీ రాష్ట్రంలో ఆడవారికి అన్యాయం చేసిన వారు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు.
వైయస్ఆర్ సీపీ హయాంలోనే మహిళలకు రక్షణ
గత వైయస్ఆర్ సీపీ హయాంలో మహిళలపై ఇటువంటి ఘటనలు జరిగితే క్షణాల్లో దోషులపై చర్యలు ఉండేవి. దిశ యాప్ ద్వారా తక్షణం చర్యలు తీసుకునేవారు. మహిళలకు మంచి చేసే ఈ యాప్ ను కూడా నిర్వీర్యం చేశారు. అన్యాయాలు, అత్యాచారాలు చేసే వారిని కూటమి నేతలు వెనకేసుకు వస్తున్నారు. ఈ రాష్ట్రం నిస్సహాయ మహిళు కారుస్తున్న కన్నీటికి కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. మళ్ళీ వైయస్ జగన్ కే ప్రజలు పట్టం కడతారు.
సినిమా ఫంక్షనల్లో రాజకీయాలు తగవు
సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు, తమకు నచ్చని పార్టీలపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం సినిమా మీదే దాని ప్రభావం పడుతుంది. సినిమాపై ఆధారపడిన వేలాది మంది నష్టపోతారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా అందరూ సంయమనంగా ఉండాలి.