చంద్రబాబు మోసాలను ప్రజల్లో మరింత ఎండగట్టాలి

Best Web Hosting Provider In India 2024

పార్టీ సీనియర్‌ నేతలతో పార్టీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి:  ప్ర‌భుత్వం మీద రోజు రోజుకు వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని, చంద్ర‌బాబు మోసాల‌ను ప్ర‌జ‌ల్లో మరింత ఎండ‌గ‌ట్టాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచించారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్‌ నేతలతో పార్టీ  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, ఇటీవల సీఎం చంద్రబాబు మాటలు, ప్రకటనలు.. తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.
    ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రం అవుతోందని, అందువల్ల పార్టీ నాయకత్వమంతా సమష్టిగా కృషి చేయాలని, సీఎం చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండ గట్టాలని సమావేశంలో సీనియర్‌ నేతలకు శ్రీ వైయస్‌ జగన్‌ సూచించారు. సూపర్‌సిక్స్‌ హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా.. అందుకే ఏవేవో సాకులు చెబుతూ.. అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు.
    వీటన్నింటి నేపథ్యంలో చంద్రబాబు వంచన, దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందు కోసం రోజూ ప్రజల్లో ఉండాలని, వారితో మరింత మమేకం కావాలని శ్రీ వైయస్‌ జగన్‌ సూచించారు.
    స‌మావేశంలోపార్టీ సీనియర్‌ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, పేర్ని కిట్టు, కొట్టు సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నందిగం సురేష్, ఎస్వీ మోహన్‌రెడ్డి, కైలే అనిల్‌కుమార్, కావటి మనోహర్‌నాయుడు, కె.సురేష్‌బాబు, గోరంట్ల మాధవ్, ఈపూరు గణేష్, ఆలూరు సాంబశివారెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, వంకా రవీంద్రనాథ్, అదీప్‌రాజు  తదితరులు పాల్గొన్నారు.

Best Web Hosting Provider In India 2024