Earthquake in Delhi : దిల్లీలో భూకంపం! ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు..

Best Web Hosting Provider In India 2024


Earthquake in Delhi : దిల్లీలో భూకంపం! ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు..

Sharath Chitturi HT Telugu
Feb 17, 2025 06:18 AM IST

Delhi earthquake : దిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై భూకంపం తీవ్రత 4.0గా నమోదవ్వగా.. చాలా చోట్ల ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

దిల్లీని వణింకించిన భూకంపం!
దిల్లీని వణింకించిన భూకంపం! (Representative Image/Reuters)

దిల్లీ-ఎన్​సీఆర్​ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 5:36 గంటలకు భూమికి 5 కిలోమీటర్ల లోతులో, రిక్టార్​ స్కేల్​పై 4.0 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.

దిల్లీ- ఎన్​సీఆర్​లో భూకంపం..

దిల్లీ, నోయిడా, ఇందిరాపురం, ఇతర ఎన్​సీఆర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. చాలా చోట్ల నిద్రలో ఉన్న ప్రజలు భూకంపం ధాటికి హఠాత్తుగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే, దిల్లీలో భూకంపంలో ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది.

ఆ వెంటనే సోషల్ మీడియాలో దిల్లీ భూకంపంపై ట్వీట్లు వెల్లువెత్తాయి. భయానక ప్రకంపనలు అనుభవించామని కొందరు నెటిజన్లు చెబుతున్నారు.

దిల్లీలో భూకంపం గురించి భారతీయ జనతా పార్టీకి చెందిన తజిందర్ బగ్గా ఎక్స్​లో పోస్ట్ చేశారు. “భూప్రకంపనలు వచ్చాయా? ఇది భూకంపమా?” అని ప్రశ్నించారు. చాలా మంది దీనికి సమాధానం ఇచ్చారు.

మరో బీజేపీ నేత షెహ్​జాద్ పూనావాలా, “బలమైన భూకంపం! ఓహ్” అని పోస్ట్ చేశారు.

తన అలారం మేల్కొలపలేకపోయినప్పటికీ, భూకంపం మాత్రం మేల్కొలిపిందని ఒక మహిళ ట్వీట్​ చెప్పింది. “నా అలారం చేయలేని పనిని చాలా బలమైన, కానీ చిన్న భూకంపం చేసింది. నేను మేల్కొని నా ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తాను,” అని ఆమె పోస్ట్ చేసింది.

“ఇలాంటి భూకంపాన్ని ఎప్పుడు ఎక్స్​పీరియెన్స్​ చేయలేదు. ఇన్సేన్​!” అని మరొకరు ట్వీట్​ చేశారు.

“భూకంపం కొన్ని సెకన్ల పాటు వచ్చింది. మా సొసైటీ మొత్తం నిద్రలేచి పరుగులు తీసింది,” అని ఇంకొకరు చెప్పుకొచ్చారు.

న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లోని ప్రయాణీకులు ఏదో రైలు భూగర్భంలో పరుగెడుతున్నట్లు అనిపించిందని ఏఎన్​ఐ వార్తా సంస్థకు తెలిపారు. “అన్నీ వణుకుతున్నాయి” అని ఒకరు అన్నారు. ప్రకంపనల వల్ల అన్నీ షేక అవుతుండటంతో ప్రజలు కేకలు వేశారని స్టేషన్​లోని ఒక వ్యాపారి చెప్పారు.

గత నెలలో, నేపాల్​లో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ ప్రకంపనలు దిల్లీ-ఎన్​సీఆర్​, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను వణికించాయి. అయితే, ఎటువంటి ఆస్తి నష్టం సంభవించలేదు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link