



Best Web Hosting Provider In India 2024

YS Jagan Meets Vamsi: విజయవాడ జైల్లో వల్లభనేని వంశీకి వైఎస్ జగన్ పరామర్శ, కిడ్నాప్ కేసులో వంశీపై అభియోగాలు
YS Jagan Meets Vamsi: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో వంశీని అరెస్ట్ చేశారు.
YS Jagan Meets Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వైసీపీ అధ్యక్షుడు జగన్ విజయవాడ జైల్లో ములాఖత్ అయ్యారు. గత వారం వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయగా న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ను కిడ్నాప్ చేసి బలవంతంగా ఫిర్యాదు ఉపసంహరించుకున్నారనే అభియోగాలపై వంశీని అరెస్ట్ చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై సార్వత్రిక ఎన్నికలకు ముందు వంశీ దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో టీడీపీ కార్యాలయం దగ్ధం అయ్యింది. ఈ దాడిపై ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ను వంశీ కిడ్నాప్ చేసి బెదిరించి బలవంతంగా కేసు ఉపసంహరించుకునేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలో కిడ్నాప్ చేసి హైదరాబాద్, విశాఖపట్నంలో సత్యవర్ధన్ను బంధించి బలవంతంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించినట్టు పోలీసులు గుర్తించారు ఈ కేసులో వంశీని గత వారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.
వంశీతో పాటు అతని అనుచరులను కూడా ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రిమాండ్లో ఉన్న వంశీని వైసీపీ అధ్యక్షుడు జైల్లో పరామర్శించారు. జగన్ రాక సందర్భంగా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్తో పాటు వంశీ భార్యను ములాఖత్కు అనుమతించారు.
సంబంధిత కథనం
టాపిక్