Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: ప్రతి విషయంలో మనసుపెట్టి అన్ని రకాలుగా మత్స్యకారులకు తోడుగా ఉండే ప్రభుత్వం మనదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఓఎన్జీసీ పైపులైన్ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను సీఎం విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు.