Kolkata rape case : 7 నెలల పసికందుపై అత్యాచారం- చావుబతుకుల మధ్య 4 సర్జరీలు.. దోషికి ఉరిశిక్ష

Best Web Hosting Provider In India 2024


Kolkata rape case : 7 నెలల పసికందుపై అత్యాచారం- చావుబతుకుల మధ్య 4 సర్జరీలు.. దోషికి ఉరిశిక్ష

Sharath Chitturi HT Telugu
Feb 19, 2025 06:40 AM IST

Kolkata rape case : కోల్​కతాలో 7 నెలల పసికందును ఎత్తుకెళ్లి, రేప్​ చేసి, రోడ్డు పక్కన వదిలేసిన వ్యక్తిని దోషిగా తేల్చుతు, అతడికి ఉరిశిక్షను విధించింది పోక్సో కోర్టు. గతేడాది డిసెంబర్​లో ఈ ఘటన జరగ్గా, ఆ పసికందు ఇప్పటికీ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

7 నెలల పసికందును రేప్​ చేసిన వ్యక్తికి ఉరిశిక్ష..
7 నెలల పసికందును రేప్​ చేసిన వ్యక్తికి ఉరిశిక్ష..

పశ్చిమ్​ బెంగాల్​ కోల్​కతాలో 7 నెలల పసికందును రేప్​ చేసిన వ్యక్తికి ఉరిశిక్ష పడింది! గతేడాది జరిగిన ఈ ఘటనను, అత్యంత అరుదైన ఘటనగా గుర్తిస్తూ, సదరు వ్యక్తిని అరెస్ట్​ చేసిన 75 రోజుల్లోపే తీర్పును వెలువరించింది పోక్సో కోర్టు.

ఇదీ జరిగింది..

ఉత్తర కోల్​కతాలోని బుర్తల్లాలో 2024 డిసెంబర్​ 1న ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన ఒక పసికందు ఏడుస్తూ స్థానికులకు కనిపించింది. ఆ పసికందుకు రక్తస్రావం అవుతుండటాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు.. రిపోర్టులను చూసి, పసికందుపై అత్యాచారం జరిగినట్టు నిర్థరించారు.

“నవంబర్​ 30- డిసెంబర్​ 1 అర్థరాత్రి సమయంలో పసికందును నిందితుడు 30 నిమిషాల పాటు చిత్రహింసలు పెట్టాడు. తల్లితండ్రులతో కలిసి ఫుట్​పాత్​ మీద పడుకున్న పసికందును ఎత్తుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను నగ్నంగా, ఒక ఆలయం పక్కన పడేసి వెళ్లిపోయాడు,” అని నాడు పోలీసులు వెల్లడించారు.

డిసెంబర్​ 5న పోలీసులు నిందితుడు రాజిబ్​ ఘోష్​ని అరెస్ట్​ చేశారు.

కాగా పసికందు ఇప్పటికీ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంది. ఇప్పటికే 4 సర్జరీలు అయ్యాయి.

‘ఇతనికి బతికే అర్హత లేదు..’

మరోవైపు రాజిబ్​ ఘోష్​పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారంపై అనేకమార్లు విచారణ చేపట్టింది స్థానిక పోక్సో కోర్టు.

“నా కెరీర్​లో ఇంతటి కృరమైన నేరాన్ని చూడలేదు. పసికందు పెరీనీల్​ భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య ఉంది. ఒకవేళ కోలుకున్నా.. ఇక సాధారణ జీవితాన్ని ఎప్పటికీ గడపలేదు,” అని ఆర్​జీ కర్​ ఆసుపత్రికి చెందిన ఓ వైద్యుడు కోర్టుకు తెలిపాడు.

ఈ వ్యవహారంపై సోమవారం తుది విచారణ చేపట్టిన పోక్సో కోర్టు.. రాజిబ్​ ఘోష్​ని దోషిగా తేల్చింది. అతడికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.

“ఈ వ్యక్తికి అసలు బతికే అర్హత లేదని, అతను అలాంటి నేరానికి పాల్పడ్డాడని జడ్జి కూడా అన్నారు,” అని స్పెషల్​ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ బివాస్​ ఛటర్జీ తెలిపారు.

బాలికపై అత్యాచారం..

పశ్చిమ్​ బెంగాల్​లో మహిళలు, బాలికల భద్రత అత్యంత ఆందోళనకరంగా మారింది. ఆడవారిపై అత్యాచారానికి సంబంధించిన వార్తలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. తల్లి తిట్టిందని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక హత్యకు గురైన ఘటన ఇటవలే చోటుచేసుకుంది. ఆమెను రేప్​ చేసి చంపేశారని పోలీసులు వెల్లడించారు.

కోల్​కతా న్యూ టౌన్​లో ఫిబ్రవరి 6 రాత్రి ఈ ఘటన జరిగింది. తల్లి తిట్టడంతో 8వ తరగతి చదువుకుంటున్న బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. కాగా శుక్రవారం ఉదయం బాలిక ఇంటికి 6 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం కనిపించింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link