AP Ration Shops : రేషన్ షాపుల్లో అరకొరగానే కందిప‌ప్పు పంపిణీ- బియ్యం, పంచదారతోనే సరిపెడుతున్నారని కార్డుదారులు అసహనం

Best Web Hosting Provider In India 2024

AP Ration Shops : రేషన్ షాపుల్లో అరకొరగానే కందిప‌ప్పు పంపిణీ- బియ్యం, పంచదారతోనే సరిపెడుతున్నారని కార్డుదారులు అసహనం

HT Telugu Mar 05, 2025 06:29 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
HT Telugu
Mar 05, 2025 06:29 PM IST

AP Ration Shops : ఏపీలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయడంలేదన్న విమర్శలు వినిపిస్తు్న్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా ఇదే తీరని రేషన్ కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తు్న్నారు. బియ్యం, పంచదార మాత్రమే వచ్చాయని, కందిపప్పు రాలేదని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు.

షన్ షాపుల్లో అరకొరగానే కందిప‌ప్పు పంపిణీ- బియ్యం, పంచదారతోనే సరిపెడుతున్నారని కార్డుదారులు అసహనం
షన్ షాపుల్లో అరకొరగానే కందిప‌ప్పు పంపిణీ- బియ్యం, పంచదారతోనే సరిపెడుతున్నారని కార్డుదారులు అసహనం
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

AP Ration Shops : రాష్ట్రంలో రేష‌న్‌కార్డు దారుల‌కు కందిప‌ప్పు పంపిణీ చేయడంలేదు. కేవ‌లం బియ్యం, పంచ‌దార‌తోనే స‌రిపెడుతున్నారని రేషన్ కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల కందిప‌ప్పు పంపిణీలో కోత విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ‌త మూడు, నాలుగు నెల‌ల నుండి ఇదే తీరు ఉందంటున్నారు. కందిపప్పు ఇచ్చినా అరకొరగానే కొంత మందికే అందుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో 1.48 కోట్ల తెల్ల రేష‌న్ కార్డులు ఉన్నాయి. ఈ రేష‌న్ కార్డుల‌కు ప్రతినెలా రేష‌న్ స‌రుకులు అందిస్తున్నారు. బియ్యం, పంచ‌దార‌, కందిప‌ప్పు పంపిణీ చేస్తామ‌ని రాష్ట్ర ప్రభుత్వం ప్రక‌టించింది. అయితే ఆచ‌ర‌ణ‌లో మాత్రం పంపిణీ జ‌ర‌గ‌టం లేదు. ఈనెల కూడా బియ్యం, పంచ‌దార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కందిప‌ప్పు లేద‌ని, అడగొద్దని రేష‌న్ డీలర్లు చెబుతున్నారు.

గత మూడు నెలల నుంచి

గ‌త మూడు, నెల‌ల నుంచి ఇదే తంతు, ఈనెల కూడా కందిపప్పు పంపిణీ లేదని రేషన్ కార్డుదారులు అసంతృప్తితో ఉన్నారు. కందిప‌ప్పు ఇస్తారేమోన‌ని ప్రతి నెలా ఎదురు చూస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వం బియ్యం, పంచ‌దార‌, కందిప‌ప్పు ఇస్తామ‌ని చెప్పిన‌ప్పటికీ, కేవ‌లం బియ్యం, పంచ‌దారే అందుతుంద‌ని వినియోగ‌దారులు అంటున్నారు. కందిప‌ప్పు తీసుకుని కొన్ని నెల‌లు అవుతోంద‌ని, ప్రతినెలా అడిగిన‌ప్పుడు కందిప‌ప్పు లేద‌ని స‌మాధానం వ‌స్తోంద‌ని వినియోగ‌దారులు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి బియ్యం, పంచ‌దార మాత్రమే త‌మ‌కు వ‌చ్చింద‌ని, వాటినే రేష‌న్ కార్డుదారుల‌కు పంపిణీ చేస్తున్నామ‌ని సివిల్ స‌ప్లై అధికారులు చెబుతున్నారు.

రేష‌న్ కార్డు దారుల‌కు కందిప‌ప్పును రూ.67కు అందించేవారు. బ‌హిరంగ మార్కెట్లో కేజీ కందిపప్పు ధ‌ర రూ.167 నుంచి రూ.180 వ‌ర‌కు ఉంటుంది. దీంతో పేద‌, మ‌ధ్యత‌ర‌గ‌తి ప్రజ‌లు బ‌హిరంగ మార్కెట్లో కొనుగోలు చేసుకోలేక‌పోతున్నారు.

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు

ఏపీలో 1.48 కోట్ల తెల్ల రేష‌న్ కార్డులు ఉన్నాయి. వీటిలో 90 ల‌క్షల కార్డులు జాతీయ ఆహార భ‌ద్రత చ‌ట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 17,941 అంత్యోద‌య అన్న యోజ‌న కార్డుదారులు, మ‌రో 1,36,420 పీహెచ్‌హెచ్ కార్డుదారులు గ‌త ఆరు నెల‌లుగా రేష‌న్ తీసుకోవ‌డం లేదు. ఈ కార్డుల‌ను తొల‌గిస్తే రూ.90 కోట్ల వ‌ర‌కు ఆదా అవుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 1.60 ల‌క్షల మందికి కొత్త రేష‌న్ కార్డులు జారీ చేసే వెసులుబాటు ఉంటుంద‌ని నిర్ణయించారు.

ఇప్పటికే రాష్ట్రంలో 3.30 ల‌క్షల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొత్త రేష‌న్ కార్డుల కోసం 30,611 ద‌ర‌ఖాస్తులు, కార్డుల స్ల్పిట్ (విభ‌జ‌న‌) కోసం 46,918 ద‌ర‌ఖాస్తులు, కుటుంబ స‌భ్యుల యాడింగ్ (కార్డులో చేర్చడం) కోసం 2,13,007 ద‌ర‌ఖాస్తులు, తొల‌గింపు కోసం 36,588 ద‌ర‌ఖాస్తులు, అడ్రస్ మార్పు కోసం 8,263 ద‌ర‌ఖాస్తులు, స‌రెండ‌ర్ కోసం 685 ద‌ర‌ఖాస్తులు ప్రభుత్వం వ‌ద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsTrending ApRation CardsTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024