




Best Web Hosting Provider In India 2024
Sharat Kamal Retirement: ఫ్యాన్స్ కు షాక్.. దిగ్గజం రిటైర్మెంట్.. టీటీకి శరత్ కమల్ గుడ్ బై.. అదే లాస్ట్ టోర్నీ
Sharat Kamal Retirement: ఓ శకం ముగిసినట్లే. అద్భుతమైన టేబుల్ టెన్నిస్ దిగ్గజం కెరీర్ కు ముగింపు. లెజెండరీ టీటీ ప్లేయర్ శరత్ కమల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. బుధవారం (మార్చి 5) అనౌన్స్ చేశాడు. డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీతో కెరీర్ ముగించబోతున్నాడు.
భారత్ లో టేబుల్ టెన్నిస్ కు పర్యాయ పదంగా మారిన దిగ్గజం శరత్ కమల్ ఆటకు వీడ్కోలు పలికాడు. టీటీ కెరీర్ కు ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించాడు. ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) స్టార్ కంటెండర్ టోర్నీ తో ఆటకు గుడ్ బై చెప్పబోతున్నట్లు వెల్లడించాడు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ కు శరత్ ఎండ్ కార్డు వేయబోతున్నాడు.
చెన్నైలోనే
తన కెరీర్ లో చివరి టోర్నీని శరత్ కమల్ చెన్నైలో ఆడబోతున్నాడు. అతను ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నీని కూడా చెన్నైలోనే ఆడాడు. ‘‘చెన్నైలో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ ఆడా. ఇప్పుడు చెన్నైలోనే చివరి అంతర్జాతీయ టోర్నీ ఆడబోతున్నా. ప్రొఫెషనల్ అథ్లెట్ గా ఇదే నా చివరి టోర్నీ’’ అని డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీ ప్రెస్ మీట్ లో 42 ఏళ్ల శరత్ ప్రకటించాడు.
తెలుగు ఫ్యామిలీ
శరత్ కమల్ తెలుగు కుటుంబానికి చెందిన ఆటగాడు. చెన్నైలో స్థిరపడ్డ ఆచంట శ్రీనివాస రావు, అన్నపూర్ణ దంపతులకు శరత్ కమల్ జన్మించాడు. నాలుగేళ్ల వయసులోనే శరత్ టేబుల్ టెన్నిస్ రాకెట్ చేతబట్టాడు. ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. భారత్ టేబుల్ టెన్నిస్ కు టార్చ్ బేరర్ గా మారాడు. రికార్డు స్థాయిలో పది సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచాడు. ఇంకెన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు.
కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు స్థాయిలో ఏడు స్వర్ణాలు గెలిచాడు. మరో మూడు రజతాలు, మూడు కాంస్యాలు ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు సొంతం చేసుకున్నాడు.
అయిదు ఒలింపిక్స్
శరత్ కమల్ అయిదు ఒలింపిక్స్ ల్లో బరిలో దిగాడు. చివరగా 2024 పారిస్ ఒలింపిక్స్ లో పోటీపడ్డాడు. కానీ ఒక్క ఒలింపిక్ మెడల్ కూడా సాధించలేకపోయాడు. ‘‘నా కెరీర్ లో కామన్వెల్త్ పతకాలున్నాయి. ఆసియా క్రీడల మెడల్స్ ఉన్నాయి. కానీ ఒలింపిక్ పతకమే మిస్సయింది. రాబోయే యువ ఆటగాళ్లు మెడల్ సాధిస్తే నా కల నిజమవుతుంది’’ అని శరత్ కమల్ పేర్కొన్నాడు.
అత్యుత్తమ ర్యాంకింగ్
42 ఏళ్ల వయసులోనూ శరత్ కమల్ అద్భుత ఆటతీరుతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికీ వరల్డ్ టేబుల్ టెన్నిస్ లో అత్యుత్తమ ర్యాకింగ్ కలిగిన భారత ఆటగాడు అతడే. శరత్ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో 42వ స్థానంలో ఉన్నాడు. మరో భారత పురుష టీటీ ప్లేయర్ మానవ్ థక్కర్ కంటే 18 స్థానాలు టాప్ లో శరత్ ఉండటం విశేషం.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link