Sobhita Dhulipala: నాగ చైతన్యతో కలిసి వెకేషన్‌లో శోభిత.. ఉల్లిపాయ సమోసా తింటూ.. లైవ్ రెజ్లింగ్ చూస్తూ..

Best Web Hosting Provider In India 2024

Sobhita Dhulipala: నాగ చైతన్యతో కలిసి వెకేషన్‌లో శోభిత.. ఉల్లిపాయ సమోసా తింటూ.. లైవ్ రెజ్లింగ్ చూస్తూ..

Hari Prasad S HT Telugu
Published Mar 07, 2025 12:14 PM IST

Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ్ల తన భర్త నాగ చైతన్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఉల్లిపాయ సమోసా తింటూ.. లైవ్ రెజ్లింగ్ చూస్తూ.. ఆ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది.

నాగ చైతన్యతో కలిసి వెకేషన్‌లో శోభిత.. ఉల్లిపాయ సమోసా తింటూ.. లైవ్ రెజ్లింగ్ చూస్తూ..
నాగ చైతన్యతో కలిసి వెకేషన్‌లో శోభిత.. ఉల్లిపాయ సమోసా తింటూ.. లైవ్ రెజ్లింగ్ చూస్తూ..

Sobhita Dhulipala: టాలీవుడ్ హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న శోభిత ధూళిపాళ్ల ఇప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తండేల్ మూవీ సక్సెస్ తర్వాత ప్రస్తుతం చైతూ కాస్త బ్రేక్ తీసుకుంటున్నాడు. దీంతో ఈ కపుల్ విదేశాలకు వెకేషన్ కోసం వెళ్లింది. ఈ సందర్భంగా శుక్రవారం (మార్చి 7) శోభిత ఆ ఫొటోలను షేర్ చేసింది.

చైతూ, శోభిత వెకేషన్

నాగ చైతన్య, శోభిత నెదర్లాండ్స్ లోని ఆమ్‌స్టర్‌డ్యామ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలనే శోభిత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. వైబ్స్ అనే సింపుల్ క్యాప్షన్ తో వీటిని అభిమానులతో పంచుకుంది.

ఇందులో ఓ అందమైన సెల్ఫీతోపాటు ఓ కెఫేలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ఫొటో, చేతికి మెహెందీ ఉన్న పిక్, ఓ టిఫిన్ బాక్స్ లో ఉల్లిపాయ సమోసాలు ఉన్న ఫొటో, ఓ లైవ్ రెజ్లింగ్ మ్యాచ్ చూస్తున్న వీడియో కూడా ఉండటం విశేషం. ఈ జంట ఈ మధ్యే యూరప్ వెళ్లినప్పటి ఫొటోలా లేక గతేడాదికి సంబంధించినవా అన్నది తెలియలేదు.

చైతన్య, శోభిత పెళ్లి

నాగ చైతన్య, శోభిత రెండేళ్ల డేటింగ్ తర్వాత గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ లో వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. అంతకు నాలుగు నెలల ముందే ఆగస్టులో ఎంగేజ్‌మెంట్ ద్వారా వీళ్ల మధ్య రిలేషన్షిప్ నిజమే అని తేలిపోయింది.

అప్పుడు నిశ్చితార్థం, తర్వాత పెళ్లి రెండు ఈవెంట్ల ఫొటోలనూ నాగార్జునే షేర్ చేశాడు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట తరచూ చాలా ఈవెంట్లలో కలిసి కనిపించింది. ఈ మధ్యే ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు.

తండేల్ ఓటీటీ స్ట్రీమింగ్

ఇక నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ శుక్రవారమే (మార్చి 7) నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. గత నెల థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసి సంచలన విజయం సాధించింది. నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది.

చైతన్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ సినిమాను ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు. లవ్ స్టోరీకి దేశభక్తిని జోడించి తీసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తుందని భావిస్తున్నారు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024