Crime news : వాట్సాప్​ గ్రూప్​ నుంచి తీసేశాడని.. అడ్మిన్​ని కాల్చి చంపేశాడు!

Best Web Hosting Provider In India 2024


Crime news : వాట్సాప్​ గ్రూప్​ నుంచి తీసేశాడని.. అడ్మిన్​ని కాల్చి చంపేశాడు!

Sharath Chitturi HT Telugu
Published Mar 09, 2025 07:20 AM IST

Pakistan crime news : వాట్సాప్​ గ్రూప్​ నుంచి తీసేశాడన్న కోపంతో, ఓ వ్యక్తి.. సదరు గ్రూప్​ అడ్మిన్​ని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ ఘటన పాకిస్థాన్​లో చోటు చేసుకుంది.

వాట్సాప్​ గ్రూప్​ అడ్మిన్​ దారుణ హత్య..
వాట్సాప్​ గ్రూప్​ అడ్మిన్​ దారుణ హత్య.. (Pixabay/File)

పాకిస్థాన్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చాట్​ నుంచి తీసేశాడన్న కోపంతో, వాట్సాప్​ గ్రూప్​ అడ్మిన్​ని ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపేశాడు! పోలీసులు అతడిని ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు.

ఇదీ జరిగింది..

పాకిస్థాన్​లోని ఖైబర్​ పఖ్తుంఖ్వ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ముస్తఖ్​ అహ్మద్​ అనే వ్యక్తి వాట్సాప్​లో ఒక గ్రూప్​కి అడ్మిన్​గా ఉన్నాడు. అదే గ్రూప్​లో ఉన్న అష్ఫఖ్​ అనే వ్యక్తితో గ్రూప్​లో అతనికి గొడవైంది. ఫలితంగా అష్ఫఖ్​ని ఆ వాట్సాప్​ గ్రూప్​ నుంచి తొలగించాడు. ఇది అష్ఫఖ్​కి నచ్చలేదు. ముస్తఖ్​పై కోపం పెంచుకున్నాడు.

గురువారం సాయంత్రం.. గొడవను పరిష్కరించుకుందామని చెప్పి ముస్తఖ్​ని పిలిపించాడు అష్ఫఖ్​. కానీ అష్ఫఖ్​ తనతో పాటు గన్​ తీసుకెళ్లి.. ముస్తఖ్​ని చంపేశాడు. ఈ విషయాన్ని ముస్తఖ్​ సోదరుడు పోలీసులకు చెప్పాడు.

“ఆ గొడవ పెద్ద విషయమే కాదు. చాలా చిన్న మాటర్​. అసలు వివాదం ఎంటో మా కుటుంబంలో ఎవరికీ తెలియదు. దానికే అష్ఫఖ్​ నా సోదరుడిని చంపేశాడు,” అని బాధితుడి సోదరుడు మీడియాకు చెప్పాడు.

ముస్తఖ్​ని చంపేసిన తర్వాత నిందితుడు ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు అతడిని ఇంకా పట్టుకోలేదని సమాచారం. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వివరించారు.

మరోవైపు చిన్న విషయానకే హత్య జరిగిందన్న వార్త కలకలం సృష్టించింది. వివాదాస్పద, సున్నితమైన ప్రాంతంలో సులభంగా ఆయుధాలు దొరుకుతుండటం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది.

ఇండియాలో కూడా..!

ఆన్​లైన్​ వివాదాల చుట్టూ నేరాలు అనేవి పాకిస్థాన్​లోనే కాదు, ఇండియాలోనూ జరుగుతున్నాయి. మహారాష్ట్ర థానెలో వాట్సాప్​ చుట్టూ జరిగిన వివాదంలో ముగ్గురు వ్యక్తులు, తమ స్నేహితుడిపై దాడి చేశారు.

ప్రధాన నిందితుడు వాట్సాప్​ గ్రూప్​ అడ్మిన్​గా ఉన్నాడు. గ్రూప్​కి తగ్గట్టు స్టేటస్​ మార్చుకోవాలని తన స్నేహితుడికి చెప్పాడు. కానీ అతను ఆ పని చేయలేదు.

అంతే! కోపంతో ఊగిపోయిన అడ్మిన్​.. మరో ఇద్దరితో కలిసి స్నేహితుడిని కత్తితో పొడిచారు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link