APSRTC Special Buses : రాజమండ్రి నుంచి అరుణాచ‌లం, రామేశ్వ‌రం యాత్ర‌కు స్పెష‌ల్ బస్.. ప్యాకేజీ వివరాలు ఇలా

Best Web Hosting Provider In India 2024

APSRTC Special Buses : రాజమండ్రి నుంచి అరుణాచ‌లం, రామేశ్వ‌రం యాత్ర‌కు స్పెష‌ల్ బస్.. ప్యాకేజీ వివరాలు ఇలా

HT Telugu Desk HT Telugu Published Mar 10, 2025 11:06 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu
Published Mar 10, 2025 11:06 AM IST

APSRTC Special Buses : పుణ్య‌క్షేత్రాలకు వెళ్లే భ‌క్తుల‌కు ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. అరుణాచ‌లం, రామేశ్వ‌రం, తిరువ‌నంత‌పురం, మ‌ధురై, ఊటీతో పాటు 13 క్షేత్రాలు, ప‌ర్య‌ాట‌క ప్రాంతాలకు స్పెష‌ల్ స‌ర్వీసును వేసింది. రాజ‌మండ్రి నుంచి ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.

ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు
ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బ‌ట్టి, ప్ర‌యాణికులు, యాత్రీకులు అత్య‌ధికంగా వెళ్లే మార్గాల‌కు అతిత‌క్కువ ధ‌ర‌కు, సుర‌క్షిత‌మైన ప్ర‌యాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే త‌మిళ‌నాడులోని అరుణాచ‌లం (తిరువ‌ణ్ణామ‌లై), రామేశ్వ‌రం, మ‌ధురై మీనాక్ష్మ‌తో పాటు కేర‌ళ‌లోని అనంత‌ప‌ద్మ‌నాభ‌ స్వామి ఆల‌యం (తిరువ‌నంత‌పురం)కు బస్సు స‌ర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది.

ప్యాకేజీ ఇదే..

అరుణాచ‌లం (తిరువ‌ణ్ణామ‌లై), రామేశ్వ‌రం యాత్ర పేరుతో యాత్రికుల కోసం ప్ర‌త్యేక స‌ర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొమ్మిది రోజుల పాటు 13 క్షేత్రాల‌ను ద‌ర్శించుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. ఈనెల 19న సాయంత్రం 6 గంట‌ల‌కు బ‌స్సు రాజ‌మండ్రి డిపో నుంచి బ‌య‌లుదేరుతుంది. ఆర్టీసీ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు స‌ర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్ల‌తో అందుబాటులో ఉటుంది. టిక్కెట్టు ధ‌ర రెండు వైపుల క‌లిపి ఒక్కరికి రూ.10,500గా ఆర్టీసీ నిర్ణ‌యించింది. న‌లుగురు కంటే ఎక్కువ మంది ఉంటే వారి ఇంటి వ‌ద్ద‌కే టికెట్లు తీసుకొచ్చి ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. భ‌క్తుల‌కు ఉద‌యం అల్పాహారం, మ‌ధ్యాహ్నం భోజ‌నం, రాత్రి అల్పాహారం అందిస్తారు.

ద‌ర్శించే పుణ్య‌క్షేత్రాలు, ప్ర‌దేశాలు..

మ‌హాగ‌ణ‌ప‌తి ఆల‌యం (కాణిపాకం), గోల్డెన్ టెంపుల్ (శ్రీపురం), అరుణాచ‌లేశ్వ‌ర‌స్వామి ఆల‌యం (అరుణాచ‌లం), సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర‌స్వామి ఆయ‌లం (ప‌ళ‌ని), ఆదియోగి దేవాల‌యం (కోయంబ‌త్తూర్‌), ఉద్యాన‌వ‌నం (ఊటీ), చాముండేశ్వ‌రి ఆల‌యం (మైసూర్‌), కృష్ణ ఆల‌యం (గురువాయుర్‌), అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి ఆల‌యం (తిరువ‌నంత‌పురం), క‌న్యాకాప‌ర‌మేశ్వ‌రి ఆల‌యం (క‌న్యాకుమారి), మ‌ధుర‌మీనాక్షి ఆల‌యం (మ‌ధురై), రామేశ్వ‌ర జ్యోతిర్లింగం (రామేశ్వ‌రం), రంగ‌నాధ ఆల‌యం (శ్రీ‌రంగం).

వివరాల కోసం..

బ‌స్సు టిక్కెట్ల బుకింగ్‌, ఇత‌ర స‌మ‌చారం కోసం రాజ‌మండ్రి ఆర్టీసీ డిపోలో సంప్ర‌దించాలి. అప్పుడే టిక్కెట్టు బుక్ చేసుకోవ‌డం సులభం అవుతుంది. యాత్రికులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆర్టీసీ అధికారి ఎస్‌.కె ష‌బ్నం కోరారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

టాపిక్

TsrtcAndhra Pradesh NewsTrending Ap
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024