AP CID Notices: కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విజయసాయి రెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు, బుధవారం విచారణకు పిలుపు

Best Web Hosting Provider In India 2024

AP CID Notices: కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విజయసాయి రెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు, బుధవారం విచారణకు పిలుపు

Sarath Chandra.B HT Telugu Published Mar 11, 2025 09:42 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Published Mar 11, 2025 09:42 AM IST

AP CID Notices: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీ పోర్టు బదలాయింపు వ్యవహారంలో దాని పూర్వపు యజమాని కేవీ రావు ఫిర్యాదుపై సాయిరెడ్డితో పాటు వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిలపై కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యవహారంలో ఈడీ కూడా కేసులు నమోదు చేసింది.

విజయ సాయిరెడ్డికి సీఐడీ నోటీసులు
విజయ సాయిరెడ్డికి సీఐడీ నోటీసులు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

AP CID Notices: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. బుధవారం ఉదయం విచారణకు రావాలని ఆదేశించింది. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను బలవంతంగా బదలాయించుకున్నారని కాకినాడ సీ పోర్ట్‌ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు గతంలో ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత సీ పోర్ట్ నాటకీయ పరిణామాల మధ్య పూర్వపు యజమాని చేతికి తిరిగి వెళ్లింది. అదే సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి సాయిరెడ్డి రాజీనామా చేశారు. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన అరబిందో గ్రూప్‌ చేతికి సీ పోర్టును బదలాయించారు. ఇది రాజకీయంగా దుమారం రేపింది.

క్రియాశీల రాజకీయాలకు దూరమవుతున్నట్టు మాజీ ఎంపీ సాయిరెడ్డి ప్రకటించినా కేసులు మాత్రం వెంటాడుతున్నాయి. తాజాగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులిచ్చింది. బుధవారం విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం నోటీసులు ఇవ్వడానికి సాయిరెడ్డి నివాసా నికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన అందుబాటులో లేకపోవటంతో, సాయిరెడ్డి సతీమణికి నోటీసులు అందజేశారు. ఈ కేసులో విజయ సాయిరెడ్డి రెండో నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి మొదటి నిందితుడిగా ఉన్నారు.

కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌ వాటాలు బదలాయింపులు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేసింది. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును నమోదు చేసింది. ఈ అభియోగాలపై రెండు నెలల క్రితమే సాయిరెడ్డిని ఈడీ విచారించింది. తాజాగా సీఐడీ విచారణకు పిలవడంతో ఆసక్తి నెలకొంది.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాaaలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Vijayasai ReddyYsrcpYsrcp Vs TdpYsrcp ManifestoKakinadaTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024