AP School Uniform : ఏపీ విద్యార్థులకు కొత్త స్కూల్‌ యూనిఫామ్‌లు – డిజైన్‌ వివరాలివే..!

Best Web Hosting Provider In India 2024

AP School Uniform : ఏపీ విద్యార్థులకు కొత్త స్కూల్‌ యూనిఫామ్‌లు – డిజైన్‌ వివరాలివే..!

Maheshwaram Mahendra Chary HT Telugu Published Mar 12, 2025 09:49 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Published Mar 12, 2025 09:49 AM IST

ఏపీ విద్యా వ్యవస్థలో మరో మార్పు రానుంది. విద్యార్థుల స్కూళ్ల యూనిఫామ్ మారనుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ షేర్ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచే ఈ స్కూల్ యూనిఫామ్ లు అందుబాటులోకి వస్తాయి.

త్వరలో కొత్త స్కూల్‌ యూనిఫామ్‌లు
త్వరలో కొత్త స్కూల్‌ యూనిఫామ్‌లు (image source @naralokesh)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ఏపీలోని కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న స్కూల్‌ యూనిఫామ్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త యూనిఫామ్ ను తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

మంత్రి నారా లోకేశ్ ట్వీట్…

“ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు పార్టీ రంగులు లేకుండా, నాయకుడి చిత్రం లేకుండా, ప్రభుత్వ బ్రాండ్ లేకుండా కొత్త యూనిఫాంలు ధరిస్తారు. నాణ్యమైన విద్యతో పాటు ప్రతి విద్యార్థికి మంచి మంచి భవిష్యత్తును ఇవ్వటంపైనే మా దృష్టి ఉంది” అని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా…. కొత్త యూనిఫామ్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.

కూటమి ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త యూనిఫామ్ లు వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం (జూన్ 12) నుంచే అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్ లో భాగంగా స్టూడెంట్లకు యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ ను అందించాలని కూడా సర్కార్ నిర్ణయించింది.

డిజైన్ వివరాలు..!

మంత్రి నారా లోకేశ్ విడుదల చేసిన ఫొటో వివరాల ప్రకారం… కొత్త యూనిఫామ్ లేత ఆకుపచ్చ రంగులో ఉంది. ఈ దుస్తులనే ప్రభుత్వం ఎంపిక చేసేందుకు నిర్ణయించింది. బెల్టు అంచులకు నలుపు రంగు, మధ్యలో తెలుపు రంగు ఉంది. వచ్చే ఏడాది జూన్‌ 12న బడులు తెరిచే రోజే విద్యార్థులకు అందించేందుకు వీలుగా కూటమి ప్రభుత్వం చర్యలను చేపట్టింది.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

టాపిక్

Nara LokeshAndhra Pradesh NewsEducation
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024