IPS Officers Suspension : నటి జత్వానీ వేధింపుల కేసు, ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

Best Web Hosting Provider In India 2024

IPS Officers Suspension : నటి జత్వానీ వేధింపుల కేసు, ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

Bandaru Satyaprasad HT Telugu Published Mar 12, 2025 06:06 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Published Mar 12, 2025 06:06 PM IST

IPS Officers Suspension : ముంబయి నటి జత్వానీపై తప్పుడు కేసు పెట్టి, వేధించారన్న అభియోగాలతో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురి సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగించింది.

నటి జత్వానీ వేధింపుల కేసు, ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు
నటి జత్వానీ వేధింపుల కేసు, ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

IPS Officers Suspension : ఏపీ ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగించింది. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నిని ఏపీ సర్కార్ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ గడువు ముగియడంతో సస్పెన్షన్‌ను సెప్టెంబరు 25 వరకు పొడిగించింది.

ముంబై నటి కాదంబరీ జత్వానీపై తప్పుడు కేసు పెట్టి వేధించినట్లు ఆరోపణలు రావడంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు చేసింది. తప్పుడు కేసులో సినీ నటి కాదంబరీ జత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ లపై పలు అభియోగాలున్నాయి. ముగ్గురు అధికారులు అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై రివ్యూ కమిటీ సిఫారసు మేరకు ఐపీఎస్‌ల సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2025 సెప్టెంబర్ 25 వరకూ ఈ ముగ్గురి సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Ap GovtAndhra Pradesh NewsTrending ApTelugu NewsIps Officers
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024