





Best Web Hosting Provider In India 2024
Rupee symbol : ‘రూపీ’ని డిజైన్ చేసిన వ్యక్తికి డీఎంకేతో లింక్- అప్పుడు అలా, కానీ ఇప్పుడు..
Rupee symbol : తమిళనాడు బడ్జెట్ లోగో నుంచి రూపీ సింబల్ని తొలగించి మరో వివాదానికి తెరతీసింది స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం. ఇంతకీ ఈ రూపీ సింబల్ని డిజైన్ చేసింది వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయనకి- డీఎంకేకి లింక్ ఉందని మీకు తెలుసా?

2025-2026 బడ్జెట్ లోగోలో.. దేశం ఆమోదించిన ‘రూపీ’ సింబల్ని మార్చి సంచలనం సృష్టించింది తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం. సాధారణంగా వినియోగించే ‘ ₹‘ చిహ్నం కాకుండా, దాని స్థానంలో తమిళ అక్షరం ‘రు’ని ప్రవేశపెట్టింది. వినియోగంలో ఉన్న రూపీ సింబల్ లేకుండానే, మార్చ్ 14న తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టనుంది సీఎం స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే. తమిళనాడు ప్రభుత్వం- కేంద్రం మధ్య హిందీ భాష, డీలిమిటేషన్ వంటి అంశాల్లో విభేదాలు కొనసాగుతున్న తరుణంలో రూపీ సింబల్ని మార్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ సహా ఇతర విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. ఇప్పుడు రూపీ సింబల్ని డీఎంకే తొలగించింది కానీ, వాస్తవానికి ఈ చిహ్నాన్ని డిజైన్ చేసింది ఆ పార్టీకి చెందిన ఒక నేత కుమారుడే అని మీకు తెలుసా?
రూపీ సింబల్ని డిజైన్ చేసింది ఈయనే..
2010లో యూపీఏ ప్రభుత్వం హయాంలో ఈ రూపీ సింబల్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిని ఉదయ కుమార్ ధర్మలింగం అనే తమిళనాడు వ్యక్తి డిజైన్ చేశారు. ఈయన డీఎంకే మాజీ ఎమ్మెల్యే, రిషివండియం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన ఎన్ ధర్మలింగం కుమారుడు.
భారత రూపాయికి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కే విధంగా ఒక సింబల్ ఉండాలని భావించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం.. డిజైన్ కోసం ఒక ఓపెన్ కాంపిటీషన్ నిర్వహించింది. ఇందులో 3,300 మంది పాల్గొన్నారు. వాటన్నింటిలో ఉదయ కుమార్ ధర్మలింగం డిజైన్ చేసిన ‘ ₹‘ ఎంపికైంది. ఈ సింబల్.. దేవనగరిలోని ‘ర’, రోమన్ లెటర్ ‘ఆర్’ కలయికతో కూడిన డిజైన్.
ఈ ₹ ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భారత కరెన్సీ, ఐడెంటిటీలో ఒక భాగమైపోయింది. దేశంలోనే కాదు అంతర్జాతీయ లావాదేవీల్లోనూ ఈ చిహ్నం ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఐఐటీ బాంబేలో ఉదయ కుమార్ ఒక డిజైన్ పోస్ట్గ్రాడ్యుయేట్. ప్రస్తుతం ఆయన ఐఐటీ గువాహటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. రూపీ చిహ్నంపై తాజాగా నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు.
“రూపీ సింబల్ని తమిళనాడు ప్రభుత్వం ఎందుకు మార్చిందో నాకు పూర్తిగా తెలియదు. కానీ ఏదైనా మార్పు చేసేందుకు ప్రభుత్వానికి వ్యూహాలు, ఆలోచనలు ఉంటాయి. 15ఏళ్ల క్రితం ప్రభుత్వం నిర్వహించిన పోటీల్లో నేను ఈ డిజైన్ని రూపొందించాను. గెలిచాను. రూపీ సింబల్ని డిజైన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇలాంటి ఒక చర్చ (రూపీ సింబల్ మార్పు) జరుగుతుందని నేను ఊహించలేదు,” అని ఉదయ కుమార్ ధర్మలింగం అన్నారు.
స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం రూపీ సింబల్ని మార్చడంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు.
“రూపీ సింబల్తో సమస్య ఉంటే 2010లోనే డీఎంకే ఎందుకు ప్రతిఘంటించలేదు? ఆ సమయంలో యూపీఏ కూటమిలో డీఎంకే భాగంగానే ఉంది. మరి ఇప్పుడు ఎందుకు సమస్య వస్తోంది,” అని నిర్మలా సీతరామన్ అన్నారు.
“డీఎంకే ప్రభుత్వం.. రూపీ సింబల్ని తొలగించడం అంటే జాతీయ చిహ్నాని తొలగించడమే కాదు, తమిళనాడు యువత సృజనాత్మ ఆలోచనలను కొట్టిపారేయడంతో సమానం,” అని ఆరోపించారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link