MP DK Aruna House : బీజేపీ ఎంపీ ఇంట్లో చొరబడిన దుండగుడు, గంటన్నర పాటు కిచెన్ లోనే – సీసీ కెమెరాలో రికార్డ్

Best Web Hosting Provider In India 2024

MP DK Aruna House : బీజేపీ ఎంపీ ఇంట్లో చొరబడిన దుండగుడు, గంటన్నర పాటు కిచెన్ లోనే – సీసీ కెమెరాలో రికార్డ్

Bandaru Satyaprasad HT Telugu Updated Mar 16, 2025 06:17 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Updated Mar 16, 2025 06:17 PM IST

Robber Enters MP DK Aruna House : బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి దుండగుడు చోరబడ్డాడు. గంటన్నరపాటు ఇంట్లో తిరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఎంపీ గది వరకూ వెళ్లాడు. అయితే ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బీజేపీ ఎంపీ ఇంట్లో చొరబడిన దుండగుడు, గంటన్నర పాటు కిచెన్ లోనే - సీసీ కెమెరాలో రికార్డ్
బీజేపీ ఎంపీ ఇంట్లో చొరబడిన దుండగుడు, గంటన్నర పాటు కిచెన్ లోనే – సీసీ కెమెరాలో రికార్డ్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Robber Enters MP DK Aruna House : సాధారణంగా దుండగులు…తాళాలు వేసి ఉన్న ఇండ్లు, భద్రత తక్కువగా ఉండే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారు. కానీ ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు చూస్తుంటే భద్రత ఎక్కువ ఉన్న ఇండ్లలో కూడా దుండగులు చోరీలకు యత్నిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరబడిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. తాజాగా తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు హల్ చల్ చేశారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడడం చర్చనీయాంశమైంది. బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 56లో నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగుడు చేతులకు గ్లౌజులు వేసుకొని, ముఖానికి మాస్క్‌ కట్టుకుని ఎంపీ ఇంట్లోకి చొరబడ్డాడు. దాదాపు గంటన్నర పాటు ఇంట్లో సంచరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కిచెన్ లో గంటన్నర, ఎంపీ గది వరకూ

“ఇవాళ తెల్లవారు జామున 3 గంటలకు ఇంట్లో శబ్దం వచ్చింది. కానీ ఇంట్లో ఎవరూ కనిపించలేదు. కిచెన్‌లో అడుగులు ఉన్నాయి. సీసీ కెమెరాలో చూస్తే ఓ వ్యక్తి వంటగది వైపు ఉన్న కిటికీ నుంచి ఇంట్లోకి వచ్చినట్టు కనిపించింది. ముఖానికి మాస్క్‌, గ్లౌజులు వేసుకున్న వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఎంపీ డీకే అరుణ ఇంట్లో లేరు. ఆమె మీటింగ్‌ కోసం నిన్న మహబూబ్‌నగర్‌ కు వెళ్లారు. ఆగంతకుడు గంటన్నర పాటు కిచెన్‌లోనే ఉన్నాడు. అనంతరం ఎంపీ గది వరకు వెళ్లాడు. అయితే ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదు. ఒక్కడే వచ్చినట్టు సీసీ కెమెరాలో కనిపించింది. ఈ విషయంపై జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాం” అని ఎంపీ డీకే అరుణ డ్రైవర్‌ మీడియాతో తెలిపారు.

ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. మాస్క్, గ్లౌజులు ధరించి వచ్చిన దొంగ ఇంట్లోకి చొరబడి కిచెన్, హాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఇందులో కచ్చితంగా ఏదో కుట్రకోణం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తనకు భద్రత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsCrime NewsHyderabadTrending Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024