Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్న 11మందిపై కేసులు నమోదు

Best Web Hosting Provider In India 2024

Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్న 11మందిపై కేసులు నమోదు

Sarath Chandra.B HT Telugu Published Mar 17, 2025 07:05 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Published Mar 17, 2025 07:05 PM IST

Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో వర్దమాన నటులు, బుల్లితెర నటులు కూడా ఉన్నారు. బెట్టింగ్ యాప్‌ల వలలో చిక్కి యువత బలవన్మరణాలకు పాల్పడుతుండటంతో వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీస్ కేసులు
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీస్ కేసులు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్ చేసి యువతను తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సూచనలతో విశాఖపట్నానికి చెందిన యూ ట్యూబర్ లోకల్‌బాయ్‌ నానిపై మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన బయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదైంది.

యూట్యూబ్‌ వీడియోలను ప్రమోట్ చేసే ముసుగులో బెట్టింగ్‌ యాప్‌లకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగుల ద్వారా తాము విపరీతంగా ఆర్జించినట్టు వల వేస్తున్నారు. ప్రమోషనల్ కోడ్స్‌ రూపంలో యువతకు వల వేసి వారి బెట్టింగులు ఆడే డబ్బుల్లో ప్రమోట్ చేసినందుకు రిఫరల్‌ డబ్బులు పొందుతున్నారు. నాలుగైదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఆర్థిక నేరాలు చాపకింద నీరులా సాగుతున్నాయి.

ఈ క్రమంలో బెట్టింగుల ఆడటం, డబ్బు పోగొట్టుకున్న తర్వాత పోయిన చోట వెదుక్కోవాలనే ధోరణితో అప్పుల పాలవడం, చివరకు వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగాయి.

కొన్నేళ్లుగా బెట్టింగ్‌ యాప్‌‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బుల్లి తెర నటులు, సినీ ప్రపంచంలో అవకాశాలను వెదక్కుంటున్న యువతులు ఈ ఆర్థిక నేరాల్లో పాల్గొంటున్నారు.

వ్యవస్థీకృత ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారికి ప్రత్యక్షంగా సహకరిస్తున్న వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వందల,వేల కోట్ల లావాదేవీలతో ముడిపడి ఉన్నఈ వ్యవహారంలో వేలాదిమంది చిక్కుకుని వాటి నుంచి బయట పడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న 11మందిపై తాజాగా సిటీ పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన వారిలో అజయ్, కిరణ్‌ గౌడ్, బయ్యాసన్నీ యాదవ్, విష్ణుప్రియ, సుప్రీత, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్‌, రీతూ చౌదరి, టేస్టీ తేజ, సుదీర్‌ రాజు తదితరులు ఉన్నారు. వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేసి వాటి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

CheatingFraudsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsTs Police
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024