NEET PG : నీట్​ పీజీ 2025పై బిగ్​ అప్డేట్​! ఈ ఏడాది పరీక్ష ఎప్పుడంటే..

Best Web Hosting Provider In India 2024


NEET PG : నీట్​ పీజీ 2025పై బిగ్​ అప్డేట్​! ఈ ఏడాది పరీక్ష ఎప్పుడంటే..

Sharath Chitturi HT Telugu
Published Mar 18, 2025 10:05 AM IST

నీట్​ పీజీ 2025పై బిగ్​ అప్డేట్​! ఈ ఏడాది ఈ పరీక్ష నిర్వహణ తేదీని అధికారులు వెల్లడించారు. జూన్​ 15న నీట్​ పీజీ 2025 పరీక్ష జరగనుంది.

నీట్​ పీజీ 2025 వివరాలు..
నీట్​ పీజీ 2025 వివరాలు..

నీట్ పీజీ 2025పై బిగ్​ అప్డేట్​! పరీక్ష నిర్వహణ తేదీని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీని 2025 జూన్ 15న నిర్వహించనున్నట్లు బోర్డు తన వెబ్​సైట్​ natboard.edu.in లో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఈ నీట్​ పీజీ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు.

“నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) నీట్-పీజీ 2025 పరీక్ష 2025 జూన్ 15న కంప్యూటర్ ఆధారిత ప్లాట్​ఫామ్​పై రెండు షిఫ్టుల్లో జరుగుతుంది,” అని నోటిఫికేషన్​లో ఉంది.

నీట్ పీజీ 2025కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్​ని త్వరలో అధికారిక వెబ్​సైట్​లో షేర్ చేస్తామని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు.

నీట్​ పీజీ 2025 ఎగ్జామ్​ డేట్​ కోసం అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నోటీసు వచ్చింది.

అధికారిక ప్రకటన చదవడం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

50శాతం ఆల్​ ఇండియా కోటా సీట్లు, రాష్ట్ర కోటా సీట్లు, ప్రైవేట్​ మెడికల్​ కాలేజీ సీట్లు, ఆర్మ్​డ్​ ఫోర్సెస్​ మెడికల్​ సర్వీస్​ ఇన్​స్టిట్యూషన్​, పోస్ట్​ ఎంబీబీఎస్​ డీఎన్​బీ అండ్​ డీఆర్​ఎన్​బీ కోర్సులు, పోస్ట్​ ఎంబీబీఎస్​ ఎన్​బీఈఎంఎస్​ డిప్లొమా కోర్సుల కోసం ప్రతియేటా నీట్​ పీజీ జరుగుతుంది.

రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహణపై అభ్యంతరం..

2024లానే ఈసారి కూడా రెండు షిఫ్టుల్లో (ఉదయం 9-12:30, మధ్యాహ్నం 3:30-7) నీట్​ పీజీ 2025ని నిర్వహించాలన్న నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్​లో పోస్టులు పెడుతున్నారు.

“రెండు షిఫ్టుల్లో పరీక్ష జరిగింది. నార్మలైజేషన్​పై గందరగోళాన్ని చూశాము. మళ్లీ అదే తప్పు ఎందుకు చేయాలి,” అని ఒకరు ట్వీట్​ చేశారు.

“ఒకే దేశం- ఒకే ఎన్నికను నిర్వహిస్తారు. కానీ ఒకే షిఫ్ట్​లో పరీక్షలను నిర్వహించలేరు,” అని మరొక ఎక్స్​ యూజర్​ ట్వీట్​ చేశారు.

“నీట్​ పీజీలో పాటించే నార్మలైజేషన్​ కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి. పరీక్ష పారదర్శనకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నయి,” అని మరొకరు పేర్కొన్నారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link