Zee Telugu New Serial: జీ తెలుగులోకి సరికొత్త సీరియల్.. ప్రారంభమయ్యే తేదీ, టైమ్ ఇదే

Best Web Hosting Provider In India 2024

Zee Telugu New Serial: జీ తెలుగులోకి సరికొత్త సీరియల్.. ప్రారంభమయ్యే తేదీ, టైమ్ ఇదే

Hari Prasad S HT Telugu
Published Apr 01, 2025 08:06 PM IST

Zee Telugu New Serial: జీ తెలుగులోకి సరికొత్త సీరియల్ వస్తోంది. వచ్చే వారం నుంచి ఈ సీరియల్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ ఓ ప్రోమో రిలీజ్ చేయడం ద్వారా వెల్లడించింది.

జీ తెలుగులోకి సరికొత్త సీరియల్.. ప్రారంభమయ్యే తేదీ, టైమ్ ఇదే
జీ తెలుగులోకి సరికొత్త సీరియల్.. ప్రారంభమయ్యే తేదీ, టైమ్ ఇదే

Zee Telugu New Serial: ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగు సరికొత్త సీరియల్ తీసుకొస్తోంది. ఈ సీరియల్ పేరు దీర్ఘసుమంగళీభవ. తాజాగా ఈ సీరియల్ ప్రోమోను కూడా ఆ ఛానెల్ రిలీజ్ చేసింది. ఈ సీరియల్ టెలికాస్ట్ తేదీ, టైమ్ ను కూడా అనౌన్స్ చేసింది.

దీర్ఘసుమంగళీభవ సీరియల్

జీ తెలుగు ఛానెల్లోకి దీర్ఘసుమంగళీభవ సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ వచ్చే సోమవారం (ఏప్రిల్ 7) నుంచి టెలికాస్ట్ కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుందని ఆ ఛానెల్ వెల్లడించింది.

“ప్రాణత్యాగంతో మొదలైన ఇంద్ర గౌతమ్ ల స్నేహ బంధం.. భవిష్యత్తులో అహల్య కోసం మరో ప్రాణత్యాగానికి దారితీయనుందా” అంటూ ఈ సీరియల్ స్టోరీ గురించి జీ తెలుగు ఛానెల్ చెప్పింది. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఈ సీరియల్ ప్రోమో కూడా రిలీజైంది.

ఇందులో ఇంద్ర, గౌతమ్ పాత్రలను పరిచయం చేశారు. చిన్నప్పటి నుంచే స్నేహ బంధంతో ఒక్కటవుతారు ఈ ఇద్దరూ. అయితే పెరిగి పెద్దయిన తర్వాత వీళ్లిద్దరి మధ్య అహల్య అనే అమ్మాయి కోసం విభేదాలు వస్తాయా అన్నట్లుగా ప్రోమోలో చూపించారు.

జీ తెలుగు సీరియల్స్ షెడ్యూల్

జీ తెలుగు ఛానెల్ ఈ మధ్య సీరియల్స్ కొత్త షెడ్యూల్ రిలీజ్ చేసింది. కొన్నాళ్ల కిందట ఆదివారం కూడా సీరియల్స్ అంటూ జీ తెలుగు ఓ వినూత్నప్రయోగానికి తెర తీసిన విషయం తెలుసు కదా. అయితే ఇప్పుడు దానికి ముగింపు పలికింది.

ముఖ్యంగా ప్రైమ్ టైమ్ అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 మధ్య సీరియల్స్ ఇక ఆదివారం ఉండబోవని వెల్లడించింది. శనివారం రాత్రి 9 గంటల నుంచి 10.30 మధ్య కూడా సీరియల్స్ ఉండవు. కొన్ని సీరియల్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకు.. మరికొన్ని సీరియల్స్ సోమవారం నుంచి శనివారం వరకు టెలికాస్ట్ కానున్నాయి.

శనివారం వరకు వచ్చే సీరియల్స్ ఇవే

జీ తెలుగు ఛానెల్ ఈ మధ్యే సీరియల్స్ కొత్త షెడ్యూల్ రిలీజ్ చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఇక నుంచి మా అన్నయ్య సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. ఆ తర్వాత 6.30 గంటలకు నిండు నూరేళ్ల సావాసం, 7 గంటలకు లక్ష్మీ నివాసం, 7.30 గంటలకు మేఘ సందేశం, 8 గంటలకు పడమటి సంధ్యారాగం, 8.30 గంటలకు చామంతి సీరియల్స్ ప్రసారమవుతాయి.

శుక్రవారం వరకు వచ్చేవి ఇవే

ఇక ప్రైమ్ టైమ్ లో వచ్చే మూడు సీరియల్స్ మాత్రం సోమవారం నుంచి శుక్రవారం వరకే టెలికాస్ట్ కానున్నాయి. ఇవన్నీ రాత్రి 9 నుంచి 10.30 గంటల మధ్య టెలికాస్ట్ అయ్యేవే. ఇక నుంచి జగద్ధాత్రి సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. ఆ తర్వాత 9.30 గంటలకు అమ్మాయిగారు, 10 గంటలకు ప్రేమ ఎంత మధురం టెలికాస్ట్ అవుతాయి.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024