ఎండలకు చర్మం కమిలిపోయిందా? ఇలా చేస్తే దురద, చికాకు వదిలేస్తుంది

Best Web Hosting Provider In India 2024

ఎండలకు చర్మం కమిలిపోయిందా? ఇలా చేస్తే దురద, చికాకు వదిలేస్తుంది

Haritha Chappa HT Telugu
Published Apr 07, 2025 06:02 PM IST

ఎండలు ముదిరిపోతున్నాయి. ఎండ వేడిమికి చర్మం కమలిపోయినట్టు అవుతుంది. దురద, చికాకు అనిపిస్తుంది. చర్మం కాలినట్టు అయిపోతుంది. కొన్ని హోం రెమెడీస్ ప్రకారం ఆ చర్మాన్ని తిరిగి నార్మల్ గా మార్చవచ్చు.

సమ్మర్ లో స్కిన్ కేర్ టిప్స్
సమ్మర్ లో స్కిన్ కేర్ టిప్స్

వేసవి తాపంలో బయటకు రావడమే చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో శారీరక సమస్యలతో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల ముఖ చర్మం ఎర్రగా మారిపోతుంది. చర్మ కణాలకు చాలా నష్టం జరుగుతుంది. సూర్యరశ్మి వేడికి చర్మంలో వాపు, ఎరుపు వంటివి వస్తాయి.

ఎండ వేడిమికి చర్మానికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాంటప్పుడు వారికి ఎరుపు, నొప్పి, వాపు కనిపిస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే చర్మంపై బొబ్బలు వస్తాయి. ఇవన్నీ వడదెబ్బకు చెందిన తేలికపాటి లక్షణాలు. వీటిని తగ్గించుకోవడానికి ఇంట్లోనే చిన్న చిట్కాలను పాటించవచ్చు.

మాయిశ్చరైజర్, లోషన్ లేదా జెల్ అప్లై చేయండి

కలబంద లోషన్, జెల్ లేదా కాలమైన్ లోషన్ సౌకర్యవంతంగా ఉంటుంది. అప్లై చేయడానికి ముందు, ఉత్పత్తిని ఫ్రిజ్లో ఉంచండి. చల్లారిన తర్వాత ముఖానికి అప్లై చేయండి. వడదెబ్బకు గురైన చర్మంపై ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తులను వాడడం మానుకోండి. ఇలా చల్లని మాయిశ్చరైజర్, లోషన్ ముఖానికి రాయడం వల్ల చర్మంపై ఎరుపు, దురద వంటివి వెంటనే తగ్గుతాయి.

సిట్రస్ పండ్లు

యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహారాలు వేడికి దెబ్బతినకుండా చర్మాన్ని రక్షించడానికి, లోపలి నుండి చర్మాన్ని కాపాడేందుకు సహాయపడతాయి. బెర్రీలు, సిట్రస్ పండ్లు, ఆకుకూరలు, గింజలను ఆహారంలో చేర్చుకోవాలి. యాంటీ యాక్సిడెంట్లు చర్మానికి మరింత నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి.

ఓట్ మీల్ ఫేస్ ప్యాక్

ఓట్మీల్ స్నానాలు వడదెబ్బతో సంబంధం ఉన్న దురద, చికాకు నుండి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అప్లై చేస్తే వడదెబ్బతో బాధపడే చర్మానికి ఉపశమనం లభిస్తుంది. ఇది ఎరుపును తగ్గించడంలో సహాయపడుతుంది.

దోసకాయ ముక్కలు

కీరదోసకాయ ముక్కలు సహజ శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వడదెబ్బకు గురైన చర్మాన్ని ఉపశమనం చేయడానికి, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. కీరదోసకాయ యొక్క చల్లని ముక్కలను నేరుగా ప్రభావిత ప్రదేశంలో అప్లై చేయండి. కీరా దోసకాయను పేస్ట్ లా చేసి చర్మానికి అప్లై చేయండి. దోసకాయ ముక్కలు తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. వడదెబ్బకు గురైన చర్మం లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

పసుపు, ముల్తానీ మిట్టి పేస్టును

ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి మిక్స్ చేయాలి. తగినన్ని నీళ్లు పోసి పేస్టులా చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ను వడదెబ్బ తగిలిన ప్రదేశంలో అప్లై చేసి ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి మరియు ముల్తానీ మిట్టితో కలిపినప్పుడు, ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024