షాకిచ్చిన సౌదీ అరేబియా.. 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. లిస్టులో భారత్ కూడా!

Best Web Hosting Provider In India 2024


షాకిచ్చిన సౌదీ అరేబియా.. 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. లిస్టులో భారత్ కూడా!

Anand Sai HT Telugu Published Apr 07, 2025 06:49 PM IST
Anand Sai HT Telugu
Published Apr 07, 2025 06:49 PM IST

Saudi Arabia visa bans : సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. 14 దేశాల పౌరులకు ఉమ్రా, వ్యాపార, కుటుంబ విజిట్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

14 దేశాలకు వీసా నిలిపివేసిన సౌదీ అరేబియా
14 దేశాలకు వీసా నిలిపివేసిన సౌదీ అరేబియా

హజ్ యాత్ర దగ్గరపడుతున్న వేళ సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. హజ్ యాత్రకు ముందే 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఉమ్రా, వ్యాపార, ఫ్యామిలీ విజిట్ వీసాలకు ఈ నిషేధం వర్తిస్తుంది. జూన్ మధ్యకాలం వరకూ అంటే హజ్ యాత్ర ముగిసేదాకా ఈ నిషేధం అమలులో ఉంటుంది.

భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా 14 దేశాల పౌరులకు వీసాల జారీని సౌదీ అరేబియా తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్ మధ్య వరకు కొనసాగే ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాల ఆమోదంపై ఇది ప్రభావం చూపనుంది. హజ్ యాత్ర సమయం దగ్గర పడుతుండటంతో రద్దీని నియంత్రించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ నిషేధాన్ని విధించినట్లు భావిస్తున్నారు. జూన్ మధ్య వరకు ఈ నిషేధం అమల్లో ఉంది.

ఈ దేశాలపై నిషేధం

భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్, మొరాకో దేశాలపై నిషేధం విధించింది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేయడానికి ప్రయత్నించే వ్యక్తులను నిరోధించడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జరిగిన హజ్ దుర్ఘటన పునరావృతం కాకుండా నిరోధించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. గత ఏడాది విపరీతమైన ఎండలు, పెద్ద సంఖ్యలో నమోదు చేసుకోని యాత్రికులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 1,200 మంది యాత్రికులు మృతి చెందారు.

రద్దీ తగ్గించేందుకు

ఈ ఏడాది వీసా నిబంధనలను కఠినతరం చేయాలని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అధికారులను ఆదేశించారని, ఆ తర్వాత నిషేధం విధించినట్లు వివిధ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఉమ్రా వీసాలు ఉన్నవారు ఏప్రిల్ 13 వరకు సౌదీ అరేబియాలోకి ప్రవేశించవచ్చు. చాలా మంది విదేశీయులు ఉమ్రా లేదా విజిట్ వీసాలపై సౌదీ అరేబియాకు వచ్చి దేశంలో ఎక్కువ కాలం ఉంటున్నందున ఈ నిషేధం అనివార్యమైందని చెబుతున్నారు. అదే వ్యక్తులు మక్కాలోని హజ్ యాత్రలో చట్టవిరుద్ధంగా చేరుతారు, అక్కడ రద్దీ పెరుగుతుంది. గందరగోళం ఏర్పడుతుంది.

హజ్ యాత్ర సమయంలో రద్దీని నియంత్రించేందుకు, సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేసేందుకు వచ్చేవారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది హజ్ సమయంలో తీవ్రమైన వేడి వాతావరణం, రిజిస్ట్రర్ కానీ యాత్రికులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఇలాంటివి మళ్లీ జరగకూడదని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు చెప్పారు.

Anand Sai

eMail

సంబంధిత కథనం

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link