Miss World 2025 Showcase : తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా మిస్ వరల్డ్​ పోటీలు, హైదరాబాద్ రానున్న 120 దేశాల మోడల్స్

Best Web Hosting Provider In India 2024

Miss World 2025 Showcase : తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా మిస్ వరల్డ్​ పోటీలు, హైదరాబాద్ రానున్న 120 దేశాల మోడల్స్

Bandaru Satyaprasad HT Telugu Published Apr 08, 2025 10:25 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Published Apr 08, 2025 10:25 PM IST

Miss World 2025 Showcase : మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పోటీలలో మొత్తం 120 దేశాలకు చెందిన మోడల్స్ పాల్గొంటారు. తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా మిస్ వరల్డ్ పోటీలు ఉండాలని టూరిజం సెక్రటరీ స్మితా సభర్వాల్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా మిస్ వరల్డ్​ పోటీలు, హైదరాబాద్ రానున్న 120 దేశాల మోడల్స్
తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా మిస్ వరల్డ్​ పోటీలు, హైదరాబాద్ రానున్న 120 దేశాల మోడల్స్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

Miss World 2025 Showcase : తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా, తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్​వరల్డ్​ పోటీలు ఉండాలని టూరిజం సెక్రటరీ స్మితా సభర్వాల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్వాగత ఏర్పాట్లపై మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పోటీలలో 120 దేశాలకు చెందిన మోడల్స్​పాల్గొంటారు. వారు మే 6, 7 న హైదరాబాద్​ చేరుకుంటారు. దీంతో వారి రాక సందర్భంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ ఉంటుంది. వీటి ఏర్పాట్ల కోసం టూరిజం, జీహెచ్ఎంసీ, హెరిటేజ్, పోలీస్ ఆఫీసర్లతో ప్యాలెస్ లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

తెలంగాణ ప్రత్యేక చాటేలా కార్యక్రమాలు

వెల్కమ్ డిన్నర్ లో తెలంగాణ టూరిజం బ్రాండ్ ఇమేజ్ అనుగుణంగా ఏర్పాట్లను చేయాలని స్మితా సభర్వాల్ అధికారులకు సూచించారు. 120 మంది మోడల్స్​ తో పాటు సుమారు 400 మంది ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు పాల్గొంటారు. ఈవెంట్​ ప్రారంభం నుంచి చివరి వరకు పర్యాటక ప్రత్యేకతలు చాటేలా కార్యక్రమాలు రూపొందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్యాలెస్ లో ఫోటోషూట్ కోసం సీటింగ్ ఏర్పాట్లు, లైవ్ మ్యూజిక్ కాంటెస్ట్, సూఫీ మ్యూజిక్, కవ్వాలీ సంగీత ప్రదర్శన, తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా 20 నిమిషాలు పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు.

సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వెల్కం డిన్నర్ ఉంటుంది. నిజాం వంటకాలు, తెలంగాణ రుచులు మెనూలో ఉంటాయి. ఈ సమీక్షలో టూరిజం డైరెక్టర్ హనుమంతు, డైరెక్టర్ యూత్ సర్వీసెస్ డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, సెట్విన్ ఎండి వేణుగోపాల్, టూరిజం, పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsHyderabadTrending TelanganaTelugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024