

Best Web Hosting Provider In India 2024
AP POLYCET 2025 Updates : ఏపీ పాలిసెట్ కు ప్రిపేర్ అవుతున్నారా..? ఉచితంగా స్టడీ మెటీరియల్, ఇలా డౌన్లోడ్ చేసుకోండి
AP Polycet Exam 2025: ఏపీ పాలిసెట్ – 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు ఏప్రిల్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అయితే ఏపీ పాలిసెట్ 2025 స్టడీ మెటీరియల్ ను సాంకేతిక విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫ్రీ మెటీరియల్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి….
ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ – 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30వ తేదీన ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తారు.మే 10వ తేదీన ఎంట్రెన్స్ ఫలితాలను ప్రకటిస్తారు.
ఓవైపు పాలిసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో…. విద్యార్థులకు ఏపీ సాంకేతిక విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఫ్రీ స్టడీ మెటీరియల్ ను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఈ స్టడీ మెటీరియల్ కాపీని పొందవచ్చు. ఈ మెటిరీయల్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి…
పాలిసెట్ మెటీరియల్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి…
- ఏపీ పాలిసెట్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉచితంగా స్టడీ మెటరీయల్ పొందాలంటే ముందుగా https://polycetap.nic.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలోని నోటిఫికేషన్ లో చూస్తే AP POLYCET Study Material – 2025 ఆప్షన్ కనిపిస్తుంది.
- ఇక్కడే తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఏ మీడియం మెటీరియల్ కావాలనుకుంటే… ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
- మీకు పీడీఎఫ్ రూపంలో మెటీరియల్ డౌన్లోడ్ అవుతుంది.దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు.
దరఖాస్తు విధానం ఇలా…
ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు… వారి హాల్ టికెట్ నెంబర్లను ఎంట్రీ చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా విద్యార్థులు మొబైల్ నెంబర్ ను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ విద్యా అర్హత వివరాలతో పాటు మరికొన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏపీ పాలిసెట్ వెబ్సైట్లోకి వెళ్లి ఈ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఓబీ, బీసీ అభ్యర్థులు రూ. 400, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఏప్రిల్ 30వ తేదీన ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది. ఈ ఎగ్జామ్ కోసం మొత్తం 500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షకు వారం ముందు హాల్ టికెట్లను విడుదల చేస్తారు. మే 10వ తేదీన ఎంట్రెన్స్ ఫలితాలను ప్రకటిస్తారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ పాలిసెట్ స్టడీ మెటీరియల్ (తెలుగు మీడియం)ను పొందండి
ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ పాలిసెట్ స్టడీ మెటీరియల్ (ఇంగ్లీష్ మీడియం)ను పొందండి
టాపిక్