




Best Web Hosting Provider In India 2024

Pawan Kalyan – Mark Shankar: మార్క్ శంకర్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ టీమ్.. ప్రస్తుతం ఎలా ఉందంటే..!
Pawan Kalyan – Mark Shankar Health Update: అగ్ని ప్రమాదంలో గాయపడిన తన కుమారుడిని చూసేందుకు సింగపూర్ చేరుకున్నారు పవన్ కల్యాణ్. చిరంజీవి కూడా వెళ్లారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తాజాగా వెల్లడించింది పవన్ టీమ్.

సింగపూర్లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. ఆ పిల్లాడి చేతులకు, కాళ్లకు గాయలవడంతో పాటు ఊరితిత్తుల్లోకి పొగ చేరింది. తన కుమారుడిని చూసేందుకు సింగపూర్ వెళ్లారు పవన్ కల్యాణ్. ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా వెంట వెళ్లారు. ఈ తరుణంలో ఏడేళ్ల మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కల్యాణ్ టీమ్ అప్డేట్ వెల్లడించింది.
కోలుకుంటున్న మార్క్.. సాధారణ గదికి..
సింగపూర్ చేరుకున్న పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి వెళ్లారని ఆయన టీమ్ తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ను పవన్ చూశారని వెల్లడించింది. చేతులు, కాళ్లకు గాయాలవటంతో ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో శంకర్కు ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారని తెలిపింది. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకుంటున్నారని, నేడు (ఏప్రిల్ 9) బుధవారం ఉదయమే అత్యవసర వార్డు నుంచి సాధారణ గదికి మార్చారని పవన్ టీమ్ అప్డేట్ వెల్లడించింది.
మూడురోజుల పర్యవేక్షణ
ఊరిపితిత్తుల్లోకి పొగ చేరటంతో మార్క్ శంకర్కు వైద్యులు మరిన్ని పరీక్షలు చేయనున్నారు. పరిస్థితిని పరిశీలించనున్నారు. దీంతో మరో మూడు రోజుల పాటు అతడు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారని పవన్ టీమ్ వెల్లడించింది.
సింగపూర్లోని ఓ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ జరుగుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలోనే పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. మార్క్ పరిస్థితి గురించి మంగళవారమే హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు పవన్. తాను అరకు పర్యటనలో ఉండగా.. ఈ ప్రమాదం గురించి తెలిసిందని అన్నారు. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడం వల్ల వైద్యులు బ్రాంకోస్కోపీ పరీక్షలు చేస్తున్నారని వెల్లడించారు. తన పెద్ద కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజునే చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ప్రమాదం జరగడం మరింత బాధగా ఉందని పవన్ అన్నారు.
పవన్తో అన్నావదినలు
మార్క్ శంకర్ను చూసేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ విమానాశ్రయం నుంచి సింగపూర్ బయలుదేరారు పవన్ కల్యాణ్. ఆయన అన్నావదినలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కూడా వెళ్లారు. వారు సింగపూర్ చేరుకొని మార్క్ను చూశారు.
సినిమాల విషయానికి వస్తే.. ‘హరి హర వీరమల్లు’ మూవీని పూర్తి చేసేందుకు ఇటీవలే ఐదు రోజులను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేటాయించారనే సమాచారం వచ్చింది. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు కూడా పవన్ లైనప్లో ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్