Tirupati Pakala Katpadi :ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, రూ.1332 కోట్లతో తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్

Best Web Hosting Provider In India 2024


Tirupati Pakala Katpadi :ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, రూ.1332 కోట్లతో తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్

Bandaru Satyaprasad HT Telugu
Published Apr 09, 2025 04:31 PM IST

Tirupati Pakala Katpadi Project : ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ, తమిళనాడు మధ్య తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ కు రూ.1332 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుతో తిరుపతితో పాటు పలు ప్రదేశాలకు కనెక్టివిటీ మెరుగుపడుతుందని పేర్కొంది.

 ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ కు కేబినెట్ ఆమోదం
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ కు కేబినెట్ ఆమోదం

Tirupati Pakala Katpadi Project : ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (104 కి.మీ) డబ్లింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.1332 కోట్లుగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టుతో ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని, లాజిస్టిక్ ఖర్చును తగ్గిస్తుందని కేంద్రం తెలిపింది. దీంతో చమురు దిగుమతులను తగ్గించడంతో పాటు, తక్కువ CO2 ఉద్గారాలకు దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు స్థిరమైన, సమర్థవంతమైన రైల్వే కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

ముఖ్యాంశాలు

  • తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ డబ్లింగ్
  • ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో తిరుపతి – పాకాల -కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (104 కి.మీ) డబ్లింగ్ కు కేంద్రం మంత్రివర్గం ఆమోదం
  • మొత్తం ఖర్చు రూ.1332 కోట్లు (సుమారుగా)
  • 400 గ్రామాలు, సుమారు 14 లక్షల జనాభాకు రైల్వే కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
  • తిరుమల వేంకటేశ్వర ఆలయానికి నిలయమైన తిరుపతికి కనెక్టివిటీ మెరుగుపడుతుంది.
  • సంవత్సరానికి 4 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా
  • డబ్లింగ్ తో భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ 113 కి.మీలకు చేరుతుంది.
  • దాదాపు 35 లక్షల పనిదినాలు సృష్టిస్తుంది.

400 గ్రామాలు, 14 లక్షల జనాభా కనెక్టివిటీ

ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్ సుమారు 400 గ్రామాలకు, సుమారు 14 లక్షల జనాభాకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇవాళ దిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. తిరుపతి-పాకాల-కాట్పాడి ప్రాజెక్ట్ తిరుమల వెంకటేశ్వర ఆలయానికి నిలయమైన తిరుపతికి కనెక్టివిటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తిరుమల ఆలయాన్ని ప్రతిరోజూ దాదాపు 75,000 మంది యాత్రికులను దర్శించుకుంటారని, కొన్ని సమయాల్లో రోజుకు 1.5 లక్షల మంది యాత్రికులను చేరుకుంటుంటారన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో దాదాపు 35 లక్షల హ్యూమన్ డేస్ ఉపాధిని సృష్టిస్తుందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏపీ, తమిళనాడులో తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (104 కి.మీ) డబ్లింగ్‌కు ఆమోదం తెలిపింది. ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదన రైల్వే కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. రద్దీని తగ్గిస్తుంది. భారతీయ రైల్వేలలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతంలో ఉపాధి/స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతుంది.

“ఈ ప్రాజెక్ట్ మల్టీ-మోడల్ కనెక్టివిటీని పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలలోని మూడు జిల్లాలను కవర్ చేస్తుంది. తిరుమల వెంకటేశ్వర ఆలయానికి కనెక్టివిటీతో పాటు, శ్రీకాళహస్తి, కాణిపాకం, చంద్రగిరి వంటి ఇతర ప్రముఖ ప్రదేశాలకు రైల్వే కనెక్టివిటీని అందిస్తుంది. దేశవ్యాప్తంగా యాత్రికులను, పర్యాటకులను ఆకర్షించడానికి సహాయపడుతుంది.

బొగ్గు, వ్యవసాయ వస్తువులు, సిమెంట్, ఇతర ఖనిజాలు వంటి వస్తువుల రవాణాకు ఇది ఒక ముఖ్యమైన మార్గం. డబ్లింగ్ తో 4 MTPA (సంవత్సరానికి మిలియన్ టన్నులు) పరిమాణంలో అదనపు సరుకు రవాణా జరుగుతుంది. రైల్వేలు పర్యావరణ అనుకూలమైనవి. ఇంధన సామర్థ్యం గల రవాణా విధానం, వాతావరణ లక్ష్యాలను సాధించడంలో, లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడంలో, చమురు దిగుమతిని తగ్గించడంలో (4 కోట్ల లీటర్లు) , CO2 ఉద్గారాలను (20 కోట్ల కిలోలు) తగ్గించడంలో సహాయపడతాయి” –కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link