





Best Web Hosting Provider In India 2024
Study in UK : ఫీజులు పెరిగినా యూకేలో చదువుకు భారీ డిమాండ్- కారణాలు ఇవే!
Study in UK : యూకేలో చదువుకు అంతర్జాతీయ విద్యార్థుల నుంచి డిమాండ్ కనిపిస్తోంది. వీసా ఫీజులు పెరిగినా, విధానపరమైన మార్పులు వచ్చినా.. విద్యార్థులు మాత్రం వెనకడుగు వేయడం లేదు. కలలు సాకారం చేసుకునేందుకు యూకేలోని మంచి యూనివర్సిటీలను ఎంచుకుంటున్నారు.

విధానపరమైన మార్పులు, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ అంతర్జాతీయ విద్యార్థుల కలల సాకారానికి యూకే గమ్యస్థానంగా నిలుస్తోంది. ఇందుకు నిత్యం పెరుగుతున్న యూకే స్టడీ వీసా అప్లికేషన్ల సంఖ్య చక్కటి ఉదాహరణ. 2024 జనవరితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో యూకే వీసా అప్లికేషన్లు 13శాతం పెరిగి 28,700కి చేరాయి. గతేడాదితో పోల్చికే యూకేలో చదువు కోసం వీసా అప్లికేషన్ల పెరగడం 2023 అక్టోబర్ తర్వాత ఇదే మొదటిసారి. దీనిబట్టి, యూకేలో విద్యకు ఉన్న డిమాండ్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఎన్ని మార్పులు వచ్చినా యూకేలో చదువకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని ఇంటర్నేషనల్ స్టూడెంట్ లోన్ లెండర్ ప్రాడిగీ ఫైనాన్స్ అంచనా వేసింది.
యూకేలో చదువుకు భారీ డిమాండ్..!
ధరలు పెరుగుతున్నప్పటికీ, అనేక విధానపరమైన మార్పులు కనిపించినప్పటికీ విద్యార్థులు యూకేని ప్రిఫర్ చేస్తుండటం.. ఇక్కడ అసలు విషయం! పోస్ట్గ్రాడ్యుయేట్ రీసెర్చ్ లేదా ప్రభుత్వ సాయంతో చదువుకునే విద్యార్థులు మాత్రమే దేశంలోకి తమతో పాటు మరొక డిపెండెంట్ని తీసుకువచ్చే విధంగా 2024 జనవరిలో అక్కడి ప్రభుత్వం కీలక రూల్ని తీసుకొచ్చింది. ఫలితంగా డిపెండెంట్ వీసా అప్లికేషన్లు భారీగా (2023 జనవరిలో 17,500 నుంచి 2025 జనవరిలే 2,300 వరకు) పడిపోయాయి. ఇక ఏప్రిల్ 2025 నుంచి వీసా అప్లికేషన్ ఫీజును 13శాతం పెంచారు. ఫలితంగా ఎడ్యుకేషన్ బడ్జెట్ మరింత పెరగనుంది.
ఈ పరిస్థితులు భవిష్యత్తు అప్లికేషన్లపై ప్రభావం చూపించవచ్చు. కానీ ఎన్ని రూల్స్ మార్చినా, ఎంత ఫీజులు పెంచినా, చదువుకు యూకే గమ్యస్థానంగా నిలుస్తుందని గత చరిత్రను చూస్తే స్పష్టమవుతుందని ప్రాడిగీ ఫైనాన్స్ వివరించింది.
“ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు తమ చదువు కోసం యూకేవైపు చూస్తున్నారు,” అని ప్రాడిగీ ఫైనాన్స్ గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సోనాల్ కపూర్ తెలిపారు. “ధరలు పెరుగుతున్న, వీసా రూల్స్ మారుతున్నా, విద్యార్థులు మాత్రం వెనకడగు వేయడం లేదు. ప్రాడిగీ ఫైనాన్స్లో వివిధ రకాల లోన్స్ ఇచ్చి విద్యార్థులకు మద్దతు ఇస్తుండటం మాకు గర్వంగా ఉంది,” అని స్పష్టం చేశారు.
మరోవైపు విద్యార్థుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పలు యూకే యూనివర్సిటీలు సైతం ముందుకొస్తున్నాయి. ఆస్టన్ యూనివర్సిటీ, బ్రునెల్ యూనివర్సిటీ, బాంగోర్ యూనివర్సిటీ, డీ-మాంట్ఫోర్ట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అబెర్దీన్, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా, యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, కింగ్స్టన్ యూనివర్సిటీలు.. ప్రాడిగీ ఫైనాన్స్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ పొందిన విద్యార్థుల సీఏఎస్ (కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్) డిపాజిట్లను రద్దు చేశాయి. ఫలితంగా విద్యార్థులపై ఆర్థిక భారాన్ని కొంతమేర తగ్గనుంది.
యూకేలో ఈయూయేతర విద్యార్థుల్లో భారతీయులే అధికం. విద్యకు ఖర్చులు పెరుగుతుండటంతో ఇప్పుడు విద్యార్థులు వివిధ వర్సిటీలను ర్యాంకింగ్స్తోనే కాదు ఆర్థిక ఖర్చులు, చదువు తర్వాత అవకాశాలను కూడా పోల్చి చూస్తున్నారు. వీరికి సాయం చేసేందుకు అనేక స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్, యూనివర్సిటీ పార్ట్నర్షిప్స్, తక్కువ ఏపీఆర్ (యాన్యువల్ పర్సెంటేజ్ రేట్)తో కూడిన లోన్కి సహ-సంతకం వంటి ఆప్షన్లు లభిస్తున్నాయి.
నిరంతరం మారుతున్న నేటి ప్రపంచ పరిస్థితుల్లో అధిక ఆర్థిక మద్దతు ఉండటం చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు, వారి భవిష్యత్తు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాడిగీ ఫైనాన్స్ లోన్లు ఇస్తోంది. తద్వారా విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకునేందుకు ముందడుగు వేయవచ్చు.
ధరల పెరుగుదల, పాలసీల మార్పులకు వర్సిటీలు, విద్యార్థులు సద్దుకుంటుంటే, వారికి ఆర్థికంగా సాయం లభిస్తుండటంతో యూకేలో చదువుకు అందరు మొగ్గుచూపుతున్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link