లవర్​తో కలిసి భర్తను దుపట్టాతో చంపిన భార్య- ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు చూశాడని..

Best Web Hosting Provider In India 2024


లవర్​తో కలిసి భర్తను దుపట్టాతో చంపిన భార్య- ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు చూశాడని..

Sharath Chitturi HT Telugu

లవర్​తో ఏకాంతంగా గడుపుతున్న ఓ మహిళను, ఆమె భర్త చూశాడు. వారి అసభ్యకర స్థితి చూసి గొడవపడ్డాడు. కోపంతో వారిద్దరు అతడిని చంపేశారు. హరియాణాలో జరిగింది ఈ ఘటన.

హరియాణాలో దారుణం!

హరియాణాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ మహిళ- లవర్​తో కలిసి తన భర్తను చంపేసింది. వారిద్దరిని అతను ఏకాంతంగా, అసభ్యకర స్థితితో చూసి, గొడవ పెట్టుకోవడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

అసలేం జరిగిందంటే..

హరియాణా హిసార్​ జిల్లాలోని ప్రేమ్​నగర్​లో ఈ ఘటన జరిగింది. 32ఏళ్ల రవీనకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా ఆమెకు ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్​ చేయడం ఇష్టం. ఇతర క్రియేటర్లతో కలిసి ఆమె డ్యాన్స్​ వీడియోలను పోస్ట్​ చేస్తుంటుంది. ఆమెకు ఒక యూట్యూబ్​ ఛానెల్​ కూడా ఉంది.

కాగా 32ఏళ్ల రవీనకు సురేష్​ అనే వ్యక్తి ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం అయ్యాడు. ఏడాదిన్నర పాటు ఇద్దరు కలిసి ఇన్​స్టాగ్రామ్​లో కంటెంట్​ క్రియేట్​ చేశారు.

వాస్తవానికి రవీన భర్త ప్రవీణ్​, అతని కుటుంబసభ్యులకు సురేష్​ అంటే ఇష్టం లేదు. అతడికి దూరంగా ఉండాలని చెప్పేవారు. కానీ రవీన మాత్రం సురేష్​తో డ్యాన్స్​లు చేసి, వీడియోలను సోషల్​ మీడియాలో అప్లోడ్​ చేయడం ఆపలేదు.

వీడియోలు అప్లోడ్​ చేయడం ఆమెకు వ్యసనంగా మారింది. భర్తతో గొడవలు జరుగుతున్నా ఆమె పట్టించుకోలేదు. కాగా గత నెల 25న.. రవీన- సురేష్​లు ఒంటరిగా, అసభ్యకర స్థితిలో ఉండటాన్ని ప్రవీణ్​ చూశాడు. ముగ్గురి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చాలా తీవ్రమైంది. చివరికి.. రవీన తన దుపట్టాను ప్రవీణ్​ గొంతుకు చుట్టింది. సురేష్​ సాయంతో భర్త గొంతు నులిమి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపేసింది.

అర్థరాత్రి బండి మీద..

భర్తను చంపిన తర్వాత అతని మృతదేహాన్ని రవీన దాచిపెట్టింది. ప్రవీణ్​ ఎక్కడ? అని అడిగినప్పుడు తనకేమీ తెలియదన్నట్టు ప్రవర్తించింది. ఆ రోజ అర్థరాత్రి.. సురేష్​ బండి మీద వచ్చాడు. రవీన- సురేష్​లు కలిసి ప్రవీణ్​ మృతదేహాన్ని బండి మీద ఎక్కించుకుని 6 కిలోమీటర్లు ప్రయాణించి దిన్నోడ్​ రోడ్​ నాలాలో పడేశారు.

మార్చ్​ 28న కుళ్లిపోయిన ఓ మృతదేహం బయటకు వచ్చింది. అది ఎవరిది? అని తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు సదర్​ పోలీస్​ స్టేషన్​ అధికారులు. ఆ మృతదేహం ప్రవీణ్​దే అని, అతను కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయాడని తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్​ పరిశీలించగా రవీన, సురేష్​లు దొరికిపోయారు. అర్థరాత్రి హెల్మెట్​ వేసుకున్న ఓ వ్యక్తి, ఓ మహిళ మధ్యలో మరొకరు ఉన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. రెండు గంటల తర్వాత రవీన, ఏమీ జరగనట్టు అదే బండి మీద ఇంటికి తిరిగివెళ్లిపోయిన దృశ్యాలు సైతం సీసీటీవీలో కనిపించాయి.

రవీన- సురేష్​లను పోలీసులు అరెస్ట్​ చేసి విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. తమ గురించి తెలిసిపోయి, ప్రవీణ్​ గొడవపెట్టుకోవడంతో అతడిని చంపేసినట్టు రవీన తెలిపింది.

రవీన- సురేష్​లను పోలీసులు జైలుకు తరలించారు. తల్లిదండ్రులు దూరమవ్వడంతో రవీన- ప్రవీణ్​ 6ఏళ్ల కుమారుడు ఇప్పుడు అతని తాత, మామ దగ్గర జీవిస్తున్నాడు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link