



Best Web Hosting Provider In India 2024
ఏపీ టెన్త్ 2025 ఫలితాలపై కీలక అప్డేట్ – ఈనెల 23న విడుదలకు కసరత్తు, ఎలా చెక్ చేసుకోవాలంటే…
ఏపీ పదో తరగతి 2025 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఏప్రిల్ 23వ తేదీన రిజల్ట్స్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే స్పాట్ ప్రక్రియ పూర్తి కాగా… సాంకేతిక అంశాల పరిశీలన కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ ఫలితాలు విడుదలయ్యాక HT తెలుగు వెబ్ సైట్ లో వేగంగా తెలుసుకోవచ్చు.
ఏపీ పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు వచ్చే వారంలో ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.
ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు సజావుగా జరిగాయి. ఆ వెంటనే ఆలస్యం చేయకుండా అధికారులు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి షురూ కాగా… ఇటీవలనే పూర్తి చేశారు. 26 జిల్లా కేంద్రాల్లో కేంద్రాలు ఈ ప్రక్రియ కొనసాగింది.
జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా స్పాట్ ప్రక్రియను చేపట్టారు. గ్రేడింగ్ తో పాటు సాంకేతికపరమైన అంశాల పరిశీలన కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. ఎలాంటి తప్పులు దొర్లకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలన చేస్తున్నారు.
ఏపీ టెన్త్ ఫలితాలను ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే… ఫలితాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనుంది. గతేడాది పరీక్షలు చూస్తే…. మార్చి 30వ తేదీతో ఎగ్జామ్స్ ముగిశాయి. ఏప్రిల్ 22వ తేదీన ఫలితాలను ప్రకటించారు.
HT తెలుగులో ఏపీ టెన్త్ ఫలితాలు:
గతేడాది మాదిరిగానే ఏపీ పదో తరగతి ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. సింగిల్ క్లిక్ తో మీ మార్కులు డిస్ ప్లే అవుతాయి. పరీక్ష రాసిన విద్యార్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి.
SSC బోర్డు సైట్ లో ఇలా చెక్ చేసుకోవాలి :
- ముందుగా ఏపీ SSC బోర్డు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఏపీ పదో తరగతి ఫలితాలు – 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ వివరాలను ఎంట్రీ చేయాలి. సబ్మిట్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
ఈసారి వాట్సాప్ లో ఏపీ టెన్త్ ఫలితాలు…!
ఈసారి ఏపీలోని టెన్త్ విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలను కూడా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
Step 2 : ఆ తర్వాత ‘సెలెక్ట్ సర్వీస్’ లో ‘విద్యా సేవలు’ ఎంచుకోవాలి.
Step 3 : ‘డౌన్లోడ్ ఏపీ SSC ఫలితాలు- 2025’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : మార్కుల మెమో పొందడానికి మీ ‘హాల్ టికెట్’ నెంబర్ను నమోదు చేయాలి.
Step 5 : పీడీఎఫ్ రూపంలో రిజల్ట్స్ కనిపిస్తాయి.
ఈ ఏడాది జరిగిన టెన్త్ పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 5,64,064 మంది ఉన్నారు. 51,069 మంది తెలుగు మీడియంలో ఎగ్జామ్స్ రాశారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్