ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ అప్లికేషన్.. గతేడాది టాపర్లు ఎలా ప్రిపేర్ అయ్యారో తెలుసుకోండి

Best Web Hosting Provider In India 2024


ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ అప్లికేషన్.. గతేడాది టాపర్లు ఎలా ప్రిపేర్ అయ్యారో తెలుసుకోండి

Anand Sai HT Telugu

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 23, 2025 నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో టాపర్లుగా నిలిచిన వారి సలహాలు, చిట్కాలు, మెలకువలు తెలుసుకోవాలి.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 (canva)

ండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), కాన్పూర్ నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2025 దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 23, 2025న ప్రారంభం కానుంది. ఆసక్తిగల అభ్యర్థులు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 2025 మే 2గా నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజును 5 మే 2025 వరకు సమర్పించవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 మే 18న జరగనుంది. అభ్యంతర విండో- మే 26 నుంచి 27 మే 2025 వరకు తెరుచుకుంటుంది. ఫైనల్ ఆన్సర్ కీ- 2 జూన్ 2025 వస్తుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. ఒక విద్యార్థి వరుసగా రెండు సంవత్సరాల్లో రెండుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాయగలరు. జేఈఈ అడ్వాన్స్‌డ్ అర్హత ప్రమాణాల ప్రకారం, జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి బీఈ, B.Tech పేపర్లో టాప్ 2,50,000లో ఉన్న విద్యార్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షకు హాజరు కావడానికి, దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలో టాప్ మార్కులు సాధించాలంటే విద్యార్థులు మరింత మెరుగ్గా ప్రిపేర్ కావాలి. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్లు మెరుగ్గా ఎలా సన్నద్ధం కావాలో సలహా ఇచ్చారు. తొలి ప్రయత్నంలోనే జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఐటీలో ప్రవేశం పొందాలనుకుంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో టాపర్లుగా నిలిచిన వారి చిట్కాలు, ట్రిక్స్ తెలుసుకోవాలి.

టాపర్ల చిట్కాలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024లో ఆలిండియా ర్యాంక్ 1 తీసుకువచ్చిన వేద్ లహతి మాట్లాడుతూ తాను ఎప్పుడూ గంటల తరబడి వెతికి చదువుకోలేదని, ఎప్పుడూ లక్ష్యాలతో చదువుకునేవ్యక్తినని చెప్పారు. టైమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకున్నానని, టెస్టులు తనకు ఎంతగానో ఉపకరించాయని చెప్పారు. తన ప్రదర్శనను సరిగా లేకుంటే నెగిటివ్‌గా తీసుకోకుండా తన బలహీనతలపై ఎక్కువ దృష్టి పెట్టానని అన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024లో వేద్ లోహతి 355 మార్కులు సాధించారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించిన ఆదిత్య తన సక్సెస్ స్ట్రాటజీలో టైమ్ మేనేజ్‌మెంట్, సబ్జెక్టుల కాన్సెప్ట్ ఎడ్యుకేషన్, టెస్ట్ రిజల్ట్స్ విశ్లేషణ, టెస్ట్ రిజల్ట్స్ ఆధారంగా ప్రాక్టీస్ వంటివి ఉన్నాయని చెప్పారు. రోజూ 6 గంటల పాటు సెల్ఫ్ స్టడీ చేసేవారు. చదువులో ఏకాగ్రత కోసం ప్రతి గంటకు చిన్నపాటి విరామం తీసుకునేవారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024లో 7వ ర్యాంకు సాధించిన ద్విజా ధర్మేష్ కుమార్ పటేల్ జేఈఈ మెయిన్ ఫలితాల తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ప్రిపేర్ కావడం ప్రారంభించానని చెప్పారు. ప్రాక్టీస్ పేపర్ సాల్వ్ చేయడం ద్వారా అడ్వాన్స్‌డ్ పరీక్షకు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టానన్నారు. ఎక్కువ ప్రాక్టీస్ పేపర్లను సాల్వ్ చేయడం తన విజయానికి ప్రధాన కారణమన్నారు.

Anand Sai

eMail

టాపిక్


Best Web Hosting Provider In India 2024


Source link