



Best Web Hosting Provider In India 2024
కశ్మీర్లో దారుణం; టూరిస్ట్ లపై ఉగ్రవాదుల కాల్పులు; 20 మంది వరకు పర్యాటకుల మృతి!
జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లోయలో దారుణం చోటు చేసుకుంది. కశ్మీర్ అందాలను చూడడానికి వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. టెర్రరిస్ట్ ల కాల్పుల్లో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. టెర్రరిస్ట్ ల కాల్పుల్లో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లోయలో కాల్పుల శబ్దం వినిపించడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రదేశాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటలిజెన్స్ ప్రాథమిక నివేదికలు హెచ్చరించాయి. కాల్పుల ఘటన అనంతరం ఈ ప్రాంతానికి అదనపు భద్రతా బలగాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.
అత్యంత సమీపం నుంచి..
గుర్తుతెలియని దుండగులు పర్యాటకులపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారని, దీంతో మృతుల సంఖ్య భారీగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో తన భర్త తలపై కాల్పులు జరిగాయని, మరో ఏడుగురికి గాయాలయ్యాయని ఒక బాధితురాలు ఫోన్ ద్వారా పీటీఐకి తెలిపింది.
ఆసుపత్రులకు తరలింపు
క్షతగాత్రులను తరలించేందుకు అధికారులు హెలికాఫ్టర్ ను రంగంలోకి దించారని, క్షతగాత్రుల్లో కొందరిని స్థానికులు తమ గుర్రాలపై సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లారని అధికారులు తెలిపారు. ఈ పర్యాటక ప్రదేశానికి కాలినడకన లేదా గుర్రంపై మాత్రమే చేరుకోవడానికి వీలు అవుతుందని అధికారులు తెలిపారు.
ఐదుగురు మృతి: మెహబూబా ముఫ్తీ
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఖండించారు. ఈ దాడిలో కనీసం ఐదుగురు చనిపోయారని ఆమె తెలిపారు. పహల్ గామ్ లో పర్యాటకులపై జరిపిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇలాంటి హింస ఆమోదయోగ్యం కాదని, దీన్ని ఖండించాల్సిందేనని ముఫ్తీ అన్నారు. సందర్శకుల భద్రత అత్యంత ముఖ్యమని, భవిష్యత్తులో దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన సీఎం అబ్దుల్లా
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండించారు. ‘‘నేను నమ్మలేనంత షాక్ కు గురయ్యాను. మా సందర్శకులపై ఈ దాడి హేయమైనది. ఈ దాడికి పాల్పడిన వారు మనుషులు కారు. వారు జంతువులతో సమానం. వారు శిక్షలకు అర్హులు. ఖండన మాటలు సరిపోవు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని అబ్దుల్లా పేర్కొన్నారు. పహల్ గామ్ లో జరిగిన ఘటనపై బీజేపీ నేత రవీందర్ రైనా స్పందిస్తూ దక్షిణ కశ్మీర్లోని అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని పాక్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link