





Best Web Hosting Provider In India 2024

కీళ్లనొప్పులను తగ్గించే మెంతి నువ్వుల లడ్డూ రెసిపీ, ఈ స్వీట్ చేయడం చాలా సులువు
లడ్డూ రెసిపీ: ఈ లడ్డూ రుచికరమైనది మరియు ఆరోగ్యానికి ఒక వరం.శీతాకాలంలో వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది మరియు మీ రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి సహాయపడుతుంది.మెంతి నువ్వుల లడ్డూను ఎలా తయారు చేయాలో చూద్దాం.
కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అలాంటి వారు ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి పోషణ అందించడంతో పాటు, శరీర వేడిని నిర్వహించడానికి ఉపయోగపడే ఆహారాలను తినాలి. కీళ్ల నొప్పుల వల్ల కూర్చోవడం కూడా కష్టమవుతుంది. మీకు కూడా ఈ పరిస్థితి ఉంటే మెంతి నువ్వుల లడ్డూను తయారు చేసుకోవచ్చు.
ఈ లడ్డూలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి వరం కూడా. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి సహాయపడుతుంది. మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట సమస్యలను పరిష్కరిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. నువ్వులు శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మెంతి నువ్వులతో తయారు చేసిన ఈ లడ్డూ అద్భుతమైన రుచిని ఇస్తుంది.
మెంతి నువ్వుల లడ్డూ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి – 100 గ్రాములు
నెయ్యి – 100 గ్రాములు
బాదం పప్పులు – యాబై గ్రాములు
బెల్లం తురుము – వంద గ్రాములు
మిరియాల పొడి – అరస్పూను
శొంఠి పొడి – రెండు టీస్పూన్లు
పసుపు – అర స్పూన్
పాలు – పావు కప్పు
మెంతులు – ఒక స్పూను
నువ్వులు – ఒక కప్పు
దాల్చిన చెక్క – రెండు ముక్కలు
యాలకులు – అయిదు
జాజికాయ – చిన్న ముక్క
నెయ్యి – రెండు స్పూన్లు
మెంతి నువ్వుల లడ్డూ రెసిపీ
- ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి మెంతులను వేయించి చల్లార్చాలి.
- ఇప్పుడు మెంతులను గోరువెచ్చని పాలలో 5 గంటలు నానబెట్టాలి.
- ఆ తర్వాత తెల్ల నువ్వులను వేయించి గ్రైండ్ చేసి బాదం, నల్ల మిరియాలు, దాల్చినచెక్క, యాలకులు, జాజికాయ వేసి గ్రైండ్ చేయాలి.
- ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి నానబెట్టిన మెంతులను మీడియం మంట మీద లేత గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.
- ఆ తర్వాత తెల్లనువ్వుల పొడి మిశ్రమాన్ని నెయ్యిలో వేసి లేత గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.
- ఒక బాణలిలో 1 టీస్పూన్ నెయ్యి వేసి కరిగించాలి. ఆ తర్వాత బెల్లం, ఎండబెట్టిన అల్లం పొడి, తరిగిన బాదం వేసి కలుపుకోవాలి.
- ఆ తర్వాత వేయించిన మెంతులు, నువ్వుల పొడి వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం గట్టిగా అయ్యేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
- ఇప్పుడు కొద్దిగా చేతులకు నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టూకోవాలి.
- ఆ తర్వాత తయారు చేసిన లడ్డూలను కాసేపు ఫ్రిజ్ లో ఉంచాలి.
- అంతే రుచికరమైన మెంతి నువ్వుల లడ్డూ రెడీ అయినట్టే. వాటిని గాలి చొరబడని కంటైనర్ లో భద్రపరుచుకోవచ్చు.
కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ లడ్డూను రోజుకొకటి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు . ఇందులో ఉండే నువ్వులు, మెంతులు మనకు ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ మెంతి నువ్వుల లడ్డూ తయారుచేసేందుకు ప్రయత్నించండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.
సంబంధిత కథనం