ఆపరేషన్ కర్రెగుట్ట.. ముగ్గురు మావోయిస్టులు మృతి.. టార్గెట్‌లో టాప్ క్యాడర్!

Best Web Hosting Provider In India 2024


ఆపరేషన్ కర్రెగుట్ట.. ముగ్గురు మావోయిస్టులు మృతి.. టార్గెట్‌లో టాప్ క్యాడర్!

Anand Sai HT Telugu

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. భద్రతా దళాలు 3 రోజుల క్రితం అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించాయి.

ప్రతీకాత్మక చిత్రం

ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ జరుగుతోంది. సెర్చింగ్ ఆపరేషన్, ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుండి వేలాది మంది సిబ్బంది ఈ ఆపరేషన్‌లో ఉన్నారు. తాజాగా బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు.

టాప్ క్యాడర్

సరిహద్దు అటవీ ప్రాంతాలలో నక్సలైట్ల ఉనికిని, వారి మౌలిక సదుపాయాలను నిర్మూలించే లక్ష్యంతో నక్సలైట్లకు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్‌లో అనేక భద్రతా విభాగాలు పాల్గొంటున్నాయి. తెలిసిన సమాచారం ప్రకారం నక్సలైట్లను అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. కింద సైనికులు మొత్తం ఓ గుట్టను చుట్టుముట్టారని చెబుతున్నారు. ఇక్కడ 100 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారు. వారిలో టాప్ క్యాడర్ నక్సలైట్లు కూడా ఉన్నారు.

భారీగా భద్రతా బలగాలు

బస్తర్ ప్రాంతంలో ప్రారంభించిన అతిపెద్ద ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో ఒకటైన ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), రాష్ట్ర పోలీసులలోని అన్ని విభాగాలతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (COBRA) సహా వివిధ విభాగాల నుండి సుమారు 10,000 మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారని అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర మావోయిస్టుల కమిటీకి చెందిన సీనియర్ కేడర్ల ఉనికి గురించి సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. చాలా రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. దట్టమైన అడవులు, కొండలతో చుట్టుముట్టిన ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిపై ఫోకస్ చేశారు.

ఇటీవలే ఎన్‌కౌంటర్

ఏప్రిల్ 21న బస్తర్‌లోని నక్సల్స్ ప్రభావిత జిల్లా బీజాపూర్‌లోని బేద్రే పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. రూ. 3 లక్షల రివార్డుతో ఉన్న నక్సలైట్ వెల్లా వాచమ్ ఇందులో చనిపోయాడు. ఇటీవల జరిగిన అంబేలి పేలుడు ఘటనలో వెల్లా ప్రమేయం ఉంది. బీజాపూర్, సుక్మా, దంతెవాడ, నారాయణపూర్‌లలో నక్సల్ కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయని అధికారులు భావిస్తున్నారు.

Anand Sai

eMail
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link