Best Web Hosting Provider In India 2024

అమరావతి: రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరునెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేయనున్నారు.