Best Web Hosting Provider In India 2024

Pallavi Prashanth : బిగ్బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే విన్నర్ పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. బిగ్ బాస్ 7 తెలుగు ఫైనల్ నేపథ్యంలో ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఘర్షణ తలెత్తింది. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రాత్రి 12 గంటల టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో అభిమానులు ప్రశాంత్ కు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో రన్నరప్గా నిలిచిన అమర్ దీప్ కూడా బయటకు రావడంతో ఇరువురి ఫ్యాన్స్ మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. దీంతో రెచ్చిపోయిన కొందరు అభిమానులు అమర్ దీప్, మరికొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లపై దాడికి దిగారు. ఈ దాడిలో అమర్ దీప్, అశ్వినీ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ట్రెండింగ్ వార్తలు
ఆర్టీసీ బస్సులు, పోలీసుల వాహనాలపై దాడి
ఆ తర్వాత ఇంకా రెచ్చిపోయిన బిగ్ బాస్ అభిమానులు ఐదుకు పైగా ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడ బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కారు అద్దంతో పాటు పోలీస్ బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం ఈ ఘటనలపై జూబ్లీహిల్స్ పోలీసులు నమోదుచేశారు. పరిస్థితులపై పోలీసులు హెచ్చరించినా పట్టించుకోకుండా ర్యాలీ నిర్వహించినందుకు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.