Drink Water After Meal : తిన్న తర్వాత ఎంత సమయానికి నీరు తాగాలి?

Best Web Hosting Provider In India 2024

నీరు లేనిది మనిషి మనుగడ లేదు. అయితే ఈ నీటిని కూడా సరైన పద్ధతిలోనే వినియోగించాలి. దాహం లేకున్నా తాగడం కూడా మంచిది కాదు. తినే సమయంలోనూ నీరు తాగేప్పుడు కొన్ని నియమాలు పాటించాలని ఆయుర్వేదం చెబుతుంది. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. నీటిని తిన్న వెంటనే ఎక్కువగా తీసుకోకూడదు. జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఆయుర్వేదం ప్రకారం భోజనం తర్వాత ఎప్పుడు నీటిని తాగాలో చూద్దాం..

 

ట్రెండింగ్ వార్తలు

మన మనుగడకు నీరు చాలా ముఖ్యం. రోజంతా ఆహారం లేకుండా ఉండొచ్చు కానీ నీళ్లు తాగకుండా ఉండలేం. మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును కాపాడుకోవడంలో నీరు సరైన పాత్రను పోషిస్తుంది. అయితే రోజూ ఎంత నీరు తాగాలి? ఏ సమయంలో తాగాలి? ముఖ్యంగా తినేటప్పుడు నీరు తాగవచ్చా? ఇలా చాలా ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి.

భోజనానికి ముందు, భోజన సమయంలో లేదా తర్వాత నీరు తాగడం జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇలా తాగడం ప్రమాదకరమని కూడా కొందరు అంటున్నారు. తినేటప్పుడు నీరు తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి మీరు తెలుసుకోవచ్చు.

తినే ముందు నీళ్లు తాగడం చాలా మంచిది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా ఆహారం కోసం జీర్ణవ్యవస్థను సిద్ధం చేస్తుంది. శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. భోజనానికి ముందు నీరు తాగితే కడుపు నిండిన భావన ఏర్పడుతుంది. అతిగా తినడం కూడా తగ్గించుకోవచ్చు. శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది. మెరుగైన జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మీరు తినడానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దీనితో చాలా ప్రయోజనాలను పొందుతారు.

 

చాలా మందికి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగే అలవాటు కూడా ఉంటుంది. ఈ అలవాటు సరిగా ఆహారం మింగడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుందని నమ్ముతారు. నోరు, గొంతు పొడిబారడాన్ని నివారిస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువ నీరు తాగడం వల్ల కడుపులోని ఆమ్లం పలచబడి ఆహారం జీర్ణం కావడానికి ఆటంకం కలుగుతుంది. కచ్చితంగా మీకు అవసరమైతే కొంచెం నీరు తాగవచ్చు.

భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది నోటిలో మిగిలిపోయిన ఆహార కణాలను తొలగించడంలో, నోటి పరిశుభ్రతను నిర్ధారించడంలో, దంత సమస్యలను తగ్గించడంలో సాయపడుతుంది. భోజనం తర్వాత నీరు తాగడం కారణంగా ఆహారం జీర్ణవ్యవస్థలో సాఫీగా సాగి మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొందరు వ్యక్తులు భోజనం చేసిన వెంటనే నీరు తాగుతారు. ఇది బరువు పెరుగుట లేదా అజీర్ణానికి దారితీస్తుందని నమ్ముతారు. మీరు కచ్చితంగా నీరు తాగాలి అనిపిస్తే.. తిన్న వెంట కొన్ని తాగండి. ఆ తర్వాత 30 నిమిషాలకు ఒక గ్లాస్ నీరు తీసుకోండి.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *