
Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam 4th January Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్లో పిల్లలకు స్వీట్స్ ఇచ్చేందుకు స్కూల్ కి బయలుదేరుతున్న మిస్సమ్మని నేను డ్రాప్ చేస్తాను అంటాడు అమర్. వద్దు నడుచుకొని వెళ్తాను అంటూ మొండికేస్తుంది మిస్సమ్మ. దాంతో మిస్సమ్మని ఒక చూపు చూస్తాడు అమర్. దాంతో వెంటనే వెహికల్లో కూర్చుంటుంది మిస్సమ్మ. ప్రిన్సిపల్ మనోహరిని కూర్చోబెట్టుకొని అంజు గురించి ఏకధాటిగా కంప్లైంట్లన్నీ ఇస్తుంది. ఆ కంప్లైంట్లు వినలేక చస్తుంది మనోహరి.
ట్రెండింగ్ వార్తలు
ఓవరాక్షన్ చేస్తుంది
ఘోర కిటికీ దగ్గరికి వచ్చి తనని రమ్మని పిలవడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తుంది మనోహరి. ఎక్కడికి వెళ్తున్నారు ఇంకా చాలా కంప్లైంట్ లు ఉన్నాయి అంటుంది ప్రిన్సిపల్. ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నారు కదా. ఇంకా కంప్లైంట్ లు ఉన్నాయా అని విసుక్కుంటుంది మనోహరి. అక్కడే ఉన్నా అరుంధతి ప్రిన్సిపల్ ఓవరాక్షన్ చేస్తుంది అని ఆమెను మనసులో తిట్టుకుంటుంది ఇంతలో లంచ్ బెల్ అవుతుంది. దాంతో పిల్లలు ఎలా తింటున్నారో ఏమో అనుకొని అక్కడ నుంచి పిల్లల దగ్గరికి వెళ్లిపోతుంది అరుంధతి.
తర్వాత మనోహరి కూడా బయటికి వచ్చేసి ఘోరని ఆత్మ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోయింది అంటాడు ఘోరా. లంచ్ బెల్ కదా పిల్లల దగ్గరికి వెళ్లి ఉంటుంది అంటుంది మనోహరి. రోజురోజుకీ ఆమెని బంధించడం కష్టమైపోతుంది అంటాడు ఘోరా. బ్రతికున్నప్పుడు పుణ్యాలు ఎక్కువ చేసింది. ఆ పుణ్యమే ఇప్పుడు కాపాడుతుంది. అయినప్పటికీ తనని వదిలిపెట్టేది లేదు అంటుంది మనోహరి. నేను కూడా అంటూ వంత పాడుతాడు ఘోర.
అమర్ ఆరా
మిస్సమ్మ, అమర్ స్కూల్ కి వస్తారు. మిస్సమ్మ డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు తండ్రిని చూడదు. కానీ ఆయన దగ్గు విని కిందికి దిగి చుట్టూ చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు. ఏం జరిగింది? ఎవరిని చూస్తున్నావు అంటాడు అమర్. ఏం లేదు ఎవరో తెలిసిన వాళ్లలా కనిపిస్తేను అంటూ పిల్లలకి లంచ్ టైం అయిపోతుంది ఇచ్చి వస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది మిస్సమ్మ. అప్పుడే రామ్మూర్తి దగ్గుకుంటూ మంచినీళ్లు తాగి బయటికి వస్తాడు. అంతలా దగ్గుతున్నారు ఏం జరిగింది అని అడుగుతాడు అమర్.
రామ్మూర్తి ఏమీ లేదు అని చెప్తాడు. వయసు పైబడిన తర్వాత వచ్చే జబ్బులను తేలికగా తీసుకోకూడదు అని చెప్తాడు అమర్. జబ్బు ఎందుకు వచ్చిందో తెలుసు. దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. నాకు మందులు కొనడానికి మా అమ్మాయి చాలా కష్టపడుతుంది. అలాగే ట్రీట్మెంట్ కోసం కూడా ఏదో దారి ఉందట దానికోసం ప్రయత్నిస్తుంది అంటాడు రామ్మూర్తి. మీకు మీ అమ్మాయి తప్ప ఎవరూ లేరా అని అడుగుతాడు అమర్.
రామ్మూర్తి ఎమోషనల్
ఒక బంధం ఉండేది కానీ నాకు తెలియకుండానే నేను పోగొట్టుకున్నాను అంటాడు రామ్మూర్తి. మీకు ఎవరూ లేరు అనే భావన పక్కన పెట్టండి. మీ కోసం మేము ఉన్నాము. ఈ వయసులో ఇంత కష్టపడకండి. కనీసం అప్పుడప్పుడు కూర్చొండి అని చెప్పి అతనిని పక్కన కూర్చోబెడతాడు అమర్. మీ ట్రీట్మెంట్ బాధ్యత కూడా నాదే అని చెప్పి వెళ్లిపోతాడు అమర్. రామ్మూర్తి అమర్ మాటలకి అమర్ ప్రవర్తనకి బాగా ఎమోషనల్ అవుతాడు.
లంచ్ కి వచ్చిన అమ్ము వాళ్లని లూజర్స్ అంటూ ఆట పట్టిస్తారు మిగిలిన పిల్లలు. ఆ మాటలకి అమ్ము బాగా డిస్టర్బ్ అవుతుంది. కానీ అంజు వాళ్లతో ఫైటింగ్కి దిగుతుంది. తన అన్నలు ఇద్దరు ఆమెని లాక్కొని వచ్చేస్తారు. తర్వాత టైం అయిపోతుంది. అక్క లంచ్ చేద్దాం అని అమ్ముతో చెప్తారు. నాకు ఆకలిగా లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది అమ్ము. అప్పుడే అక్కడికి వచ్చిన మిస్సమ్మకి జరిగిందంతా చెప్తారు పిల్లలు.
పక్క వీధి ఆవిడ
పిల్లలతో మాట్లాడుతూ ఉంటుండగానే అరుంధతిని చూస్తుంది మిస్సమ్మ. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతుంది. మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు కదా అని ఎవరో అమ్మాయిని చూపిస్తుంది అరుంధతి. వాళ్లిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే మిస్సమ్మ వైపు అయోమయంగా చూస్తూ ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు పిల్లలు. మన పక్కింటి ఆంటీ అని అరుంధతిని చూపిస్తుంది మిస్సమ్మ. అదే సమయంలో వేరే ఆవిడ అక్కడ కూర్చోవడంతో ఆవిడ మన పక్కింటి ఆవిడ కాదు మన పక్క వీధి ఆవిడ అని చెప్తారు పిల్లలు.
ఎవరైతే ఏముంది గాని ముందు నువ్వు ఓడిపోతాను అనే భయాన్ని పక్కన పెట్టు. ఎవరైతే నిన్ను ఆటపట్టిస్తున్నారో వాళ్ల దగ్గరే నువ్వు గెలిచి చూపిస్తేనే కిక్కు అంటూ అమ్ముని మోటివేట్ చేస్తుంది మిస్సమ్మ. మరి గేటు దగ్గర కూర్చున్న రామ్మూర్తిని భాగమతి చూస్తుందా? అరుంధతి ఆత్మను బంధించాలనే ఘోరా ప్రయత్నం ఫలిస్తుందా? అనే విషయాలు తెలియాలంటే జనవరి 5న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!