Best Web Hosting Provider In India 2024
Yatra 2 Teaser: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న యాత్ర 2 టీజర్ శుక్రవారం రిలీజైంది. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ జీవితంలో జరిగిన పరిణామాలేమిటి? అవినీతి కేసుల్లో అతడు ఎలా ఇరుక్కున్నాడు?వాటి నుంచి బయటపడి ప్రజల ఆమోదంతో ముఖ్యమంత్రిగా ఎలా మారాడన్నది ఇంటెన్స్గా ఈ టీజర్లో చూపించారు. టీజర్ను గమనిస్తే…వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్నహార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు.
ట్రెండింగ్ వార్తలు
అదే సందర్భంలో తండ్రిలాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ అడ్డంకులను జగన్ ఎలా అధిగమనించారు.. తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారనేదే ‘యాత్ర 2’ సినిమా. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మహి.
ఇందులో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. యాత్ర 2 సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైఎస్ రాజశేఖర్రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. యాత్ర 2 ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతోంది.