అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచిన చరిత్ర మనది

Best Web Hosting Provider In India 2024

నాలుగో విడ‌త వైయ‌స్ఆర్ చేయూత కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

మహిళా దినోత్సవం ముందురోజు అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉంది

58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం

అక్కచెల్లెమ్మల సాధికారితకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించాం

నాలుగో విడ‌త వైయ‌స్ఆర్ చేయూత ద్వారా 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మ‌హిళ‌లకు రూ.5,060 కోట్లు విడుద‌ల‌

14 రోజుల పాటు పండుగ వాతావ‌ర‌ణంలో చేయూత కార్యక్రమం కొనసాగుతోంది

ఈ ఒక్క‌ప‌థ‌కం ద్వారా 33,14,916 మంది అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.19,189 కోట్లు అందించాం

అమ్మఒడి పథకంతో 53లక్షల మంది తల్లులకు అండగా నిలిచిన ప్రభుత్వం మనది 

నామినేటెడ్‌ పోస్టుల్లోనూ, ప‌నుల్లోనూ 50 శాతం చ‌ట్టం చేసి మహిళల‌కు రిజర్వేషన్లు కల్పించాం

మహిళల రక్షణ కోసం దిశా యాప్‌, దిశా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశాం

వైయ‌స్ఆర్‌ ఆసరా ద్వారా పొదుపు సంఘాలకు ఊపిరి పోశాం

99.83 శాతం రుణాల రికవరీతో దేశంలోనే పొదుపు సంఘాలు నెంబర్‌ వన్‌గా ఉన్నాయి

చంద్రబాబు పేరు చెబితే మోసాలు.. ద‌త్త‌పుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం 

2014లో వీరిద్దరి సంత‌కాలు చేసిన‌ మేనిఫెస్టోలోని వాగ్దానాల్లో ఒక్క‌టైనా నెర‌వేర్చారా..?

ఆడ బిడ్డ పుట్టిన వెంట‌నే రూ.25వేలు అన్నారు.. అమ‌లు చేశారా..?

గ‌తంలో మహాలక్ష్మి అని అమ్మవారి పేరుపెట్టి మోసం చేశారు

నేడు మ‌హాశ‌క్తి అని మ‌రోసారి అమ్మ‌వారి పేరుతో ద‌గాచేసేందుకు సిద్ధ‌మ‌య్యారు

58 నెల‌ల మ‌న ప్ర‌భుత్వానికి మ‌ధ్య తేడా గురించి ఆలోచ‌న చేయండి..

మీ ఇంట్లో మంచి జ‌రిగితేనే మీ బిడ్డ‌కు సైనికులు, స్టార్‌క్యాంపెయిన‌ర్లుగా ముందుకు క‌ద‌లండి

అనకాపల్లి: ‘‘ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగూ నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందురోజున నా అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఈరోజు వైయస్‌ఆర్‌ చేయూత అనే కార్యక్రమాన్ని నా అక్కచెల్లెమ్మల సమక్షంలో అనకాపల్లి నుంచి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్రరాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఈమధ్య కాలంలో కేంద్రం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయని, అందుకు సాధికారత కోసం మనం ఇచ్చిన తోడ్పాటు, అక్కచెల్లెమ్మల స్వయంకృషి రెండూ కలవడమేనన్నారు. 

అనకాపల్లి జిల్లా కశింపేట మండలం పిసినికాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ చేయూత నాలుగో విడత నిధులను సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. నాలుగో విడతగా 45–60 సంవత్సరాల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రూ.5,060 కోట్లు నేరుగా బటన్‌ నొక్కి విడుదల చేశారు. అంతకుముందు సభా వేదికనుంచి అక్కచెల్లెమ్మలకు ఈ 58 నెలల వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ పాలనలో చేసిన మంచిని సీఎం వైయస్‌ జగన్‌ గణాంకాలతో సహా వివరించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి ప్రసంగం
భారతదేశ చరిత్రలోనే 28 రాష్ట్రాల్లో అక్కచెల్లెమ్మల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా కూడా లేదు.. ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం తప్ప అని చెప్పడానికి గర్వపడుతున్నాను. మహిళా పక్షపాత ప్రభుత్వానికి అర్థం చెబుతూ 58 నెలల పాలన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత కార్యక్రమం, నాలుగో విడత నిధులను 45–60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ పాలుపంచుకుంటూ అక్కచెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. 

14 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అక్కచెల్లెమ్మలకు జరిగిన మంచి, పేద కుటుంబాల జీవితాలు ఏ విధంగా బాగుపడ్డాయి, అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా ఏ విధంగా బాగుపడ్డారనే విషయాలను ప్రతి సచివాలయంలో, ప్రతి మండలంలోనూ ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా, స్ఫూర్తిదాయకం అయ్యే విధంగా పండుగ వాతావరణంలో ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ మైక్‌ పట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 

గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్లు పైబడిన నా అక్కచెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారు.. ఆ కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి.. ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందని కనీసం ఆలోచన కూడా గత ప్రభుత్వాలు చేయలేదు. కానీ, ఈ రోజు గర్వంగా చెబుతున్నాను.. అటువంటి నా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచన చేశాం. బాధ్యతాయుతమైన వయసులో ఉన్న అక్కచెల్లెమ్మల చేతుల్లో డబ్బు పెడితే ఆ కుటుంబాలు బాగుపడతాయని మనస్ఫూర్తిగా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచన చేసి ప్రతి అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ, చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా క్రమం తప్పకుండా ప్రతి ఏటా రూ.18,750 వారి చేతుల్లో పెడుతూ.. నాలుగేళ్లలో వారికి జీవనోపాధి కోసం మార్గాలు చూపిస్తూ ఏకంగా రూ.75 వేల ఆర్థిక సాయం చేస్తానని ఇదే జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో కే.కోటపాడులో చేయూత అనే కార్యక్రమం గురించి చెప్పాను. చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం నాలుగో విడత కూడా ఇదే అనకాపల్లి జిల్లాలోనే అమలు చేస్తున్నామని చెప్పడానికి సంతోషపడుతున్నాను. 

ప్రతి అక్కచెల్లెమ్మ తాను తన కాళ్ల మీద నిలబడేలా, క్రమం తప్పకుండా వారికి సాయం అందిస్తూ, బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ, మల్టీనేషనల్‌ కంపెనీస్‌ అమూల్, ఐటీసీ, రిలయన్స్, హిందుస్తాన్‌ లీవర్‌ వంటి రకరకాల కంపెనీలతో అక్కచెల్లెమ్మలకు తోడ్పాటును అందిస్తూ, ఆ కంపెనీలతో టైఅప్‌ చేయించడం, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం, ప్రతి సంవత్సరం రూ.18,750 ప్రభుత్వం ఎలాగూ ఇస్తుంది కాబట్టి.. ఆ అక్కచెల్లెమ్మలకు అన్ని రకాల అండదండలు బ్యాంకుల నుంచి, కంపెనీల నుంచి ఇప్పిస్తూ, ఏకంగా 1.69 లక్షల మంది కిరాణా షాపులు పెట్టుకొని నడుపుతున్నారు. 85,630 మంది అక్కచెల్లెమ్మలు వస్త్ర వ్యాపారం, 3,80,466 మంది అక్కచెల్లెమ్మలు గేదెలు, ఆవులు కొనుగోలు చేసి పాడి రైతులుగా మారారు. 1,34,514 మంది అక్కచెల్లెమ్మలు మేకలు కొనుగోలు చేశారు. 88,923 మంది అక్కచెల్లెమ్మలు ఫుడ్‌ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారు. 3,98,422 మంది అక్కచెల్లెమ్మలు అగ్రికల్చర్‌ ప్రోడక్ట్స్‌కు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారు. మరో 2,59,997 మంది అక్కచెల్లెమ్మలు రకరకాల కార్యక్రమాలు చేస్తూ వారి కాళ్ల మీద వారు నిలబడి ఇంటిని కూడా నడుపుతున్నారంటే.. అక్షరాల 16,55,991 మంది అక్కచెల్లెమ్మలు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము నడుపుకుంటూ కనీసం నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేలు సంపాదించుకుంటూ చిక్కటి చిరునవ్వులతో తాను బతుకుతూ తన కుటుంబానికి తోడుగా ఉందంటే మార్పు ఒకసారి గమనించండి.. ఎప్పుడూ జరగని విధంగా గొప్ప మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. 

ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైయస్‌ఆర్‌ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగో విడతగా 26,98,931 మంది నా అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ.5,060 కోట్లు నేడు మీ బిడ్డ బటన్‌ నొక్కి విడుదల చేస్తున్నాడని చెప్పడానికి సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఈరోజు నుంచి మరో 14 రోజుల పాటు ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగనుంది. దీంతో నా అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్‌ చేయూత అనే ఈ ఒక్క పథకం ద్వారా ఏకంగా రూ.75 వేలు పెట్టినట్టు అయ్యిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ 58 నెలల కాలంలోనే వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా 33,14,916 మంది నా అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.19,189 కోట్లు నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లోకి పంపించడం జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు.. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తున్నాయి. 

నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వును చూసేందుకు వారికి మంచి తమ్ముడిగా, మంచి అన్నగా దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటాను. ఈ చేయూత పథకం ద్వారా మొత్తం 33,14,916 మంది నా అక్కచెల్లెమ్మలు ప్రయోజనం పొందితే.. మీ బిడ్డ అందిస్తున్న నవరత్నాల పథకాల ద్వారా మరో రూ.29,588 కోట్లు అందుకున్నారు. ఇదే అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మరో రూ.56,188 కోట్లు కూడా అందించామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగూ మహిళా పక్షపాత ప్రభుత్వంగా, నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వారి కుటుంబాలకు మంచి జరగాలని ఈ 58 నెలల కాలంలో ఆ అక్కచెల్లెమ్మల గురించి ఆలోచన చేశాం. విద్య పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, జెండర్‌ పరంగా, నా అక్కచెల్లెమ్మల భద్రత పరంగా, వారందరి సాధికారత లక్ష్యంగా ఈ 58 నెలల కాలంలో గొప్పగా అడుగులు వేశామని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

నేను చెప్పే ఈ మాటల గురించి ఆలోచన చేయండి.. 

గతంలో ఎప్పుడైనా ఇలా మంచి జరిగిందా అని ప్రతి అక్కచెల్లెమ్మ, వారి కుటుంబాలు ఆలోచన చేయాలని కోరుతున్నాను. మొట్టమొదటి సారిగా నా అక్కచెల్లెమ్మలు బాగుండాలని రాజకీయ సాధికారత కల్పిస్తూ నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ మీద ఇచ్చే కాంట్రాక్ట్‌లు 50 శాతం చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నాను.

గత ప్రభుత్వానికి అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసే మనసే లేదు. ఏకంగా చట్టం చేయాలని, 50 శాతం పదవులు నా అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని, 50 శాతం నామినేషన్‌ వర్క్స్‌ ఇచ్చే విధంగా చట్టం చేయాలనే మనసే గత ప్రభుత్వానికి లేదు. 

చరిత్రలో తొలిసారిగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా చదివించే తల్లులకు ప్రోత్సాహకరంగా కేవలం మీ బిడ్డలను బడులకు పంపిస్తే చాలు.. ఆ పిల్లలకు మంచి మేనమామగా, అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, తమ్ముడిగా అమ్మఒడి అనే పథకం తీసుకువచ్చి ఏకంగా 53 లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా రూ.15 వేలు ఇస్తూ వారికి అండగా నిలబడిన ప్రభుత్వం, చదువులను ప్రోత్సహించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు, రాష్ట్రంలో ఎప్పుడూ గతంలో చూసింది లేదు. కేవలం 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగిన మార్పు ఇది.  గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్ర లేదు. 

గతంలో ఎన్నడూ జరగని విధంగా అక్కచెల్లెమ్మల పిల్లలు చదువులకు ఇబ్బందిపడకుండా, తల్లిదండ్రులు అప్పుపాలు కాకూడదని ఆలోచన చేసి జగనన్న విద్యా దీవెన కింద పూర్తిఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే పథకం, జగనన్న వసతి దీవెన మొదలు అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ కళ్యాణమస్తు, షాదీ తోఫా వరకు ప్రతి పథకంలో కూడా నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఆ చదువుల కోసం ఏ ఒక్కరూ ఇబ్బందిపడకూదని ప్రతి రూపాయి కూడా నా అక్కచెల్లెమ్మల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తూ తోడుగా నిలబడిన ప్రభుత్వం మనది. ఇలా రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు, చూడలేదు, దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

గత ప్రభుత్వానికి అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎప్పుడూ లేదు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు జరిగి అడుగులు పడుతున్నాయి. 

వైయస్‌ఆర్‌ ఆసరా ద్వారా, వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ ద్వారా, పొదుపు సంఘాల ఉద్యమానికి ఊపిరిపోశాం. గతంలో పొదుపు సంఘాలన్నీ కుదేలైపోయాయి. ఎంపీఏలు, ఔట్‌స్టాండింగ్‌గా ఏకంగా 18 శాతం అక్కచెల్లెమ్మల బతుకులన్నీ చిన్నాభిన్నమైన పరిస్థితి నుంచి పొదుపు సంఘాల ఉద్యమానికి ఊపిరిపోసి, అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేసి ఇప్పుడు ఏకంగా 99.83 శాతం రుణాల రికవరీతో దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్నాయని చెప్పడానికి గర్వపడుతున్నాను. గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు మోసం చేసిన చరిత్రే ఉంటే.. మన ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ప్రతి అడుగులో అండగా నిలిచిన చరిత్ర మనదీ అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆలోచన చేయండి. వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 45–60 సంవత్సరాల మధ్య వయసున్న నా అక్కచెల్లెమ్మలు ఏకంగా 33 లక్షల మందికి తోడుగా ఉంటూ, వారి ఆర్థిక పటిష్టతకు ఈ నాలుగేళ్లలోనే ఏకంగా రూ.19,190 కోట్ల సాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలు అమలు జరిగాయా అని ఆలోచన చేయండి. 

45–60 సంవత్సరాల మధ్య వయసున్న నా కాపు అక్కచెల్లెమ్మలకు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేలు అందిస్తున్నాం. కాపు నేస్తం కింద, ఈబీసీ నేస్తం కింద వారి ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు అందిస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగని, చూడని విధంగా అడుగులు పడుతున్నాయని ఆలోచన చేయండి. గత చంద్రబాబు ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు. 

సొంత ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మల పేరు మీద కేవలం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. అందులో 22 లక్షల ఇళ్లు కూడా నిర్మిస్తున్న ప్రభుత్వం మనది. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విశేషం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలు కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటు భూమి అయినా ఇచ్చాడా అంటే సున్నా.. కట్టింది అరకొర ఇళ్లు. 

చరిత్రలో తొలిసారిగా నా అక్కచెల్లెమ్మ రక్షణ కోసం, వారి భద్రత కోసం ప్రతి గ్రామ,వార్డు సచివాలయంలో ఒక మహిళా పోలీస్‌ను నియమించాం. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్‌లోనూ ఒక దిశ యాప్, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు అనే వ్యవస్థను నెలకొల్పింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈరోజు ఏకంగా కోటి 30 లక్షల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్‌ ఉంది. ఏ ఆపద వచ్చినా ఫోన్‌లోని ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా, ఐదుసార్లు ఫోన్‌ షేక్‌ చేసినా వెంటనే ఫోన్‌ వస్తుంది, 10 నిమిషాల్లో పోలీస్‌ సోదరుడు వచ్చి తోడుగా నిలబడే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 58 నెలల కాలంలోని మీ బిడ్డ ప్రభుత్వంలోనే. ఇలా ఆపదలో ఉన్న 35 వేల మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడినందు వలన మంచి జరిగింది. 

గ్రామాల్లో, ప్రతి వార్డుల్లోనూ సేవా సారథులుగా సచివాలయాల్లో, వలంటీర్‌ వ్యవస్థ ఇలా ఏ వ్యవస్థ తీసుకున్నా.. అందులో ఏకంగా 50 శాతం చదువుకున్న మన ఇరుగుపొరుగు చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. సచివాలయ వ్యవస్థ, వలంటీర్‌ వ్యవస్థ చూసినా ఏకంగా 50 శాతం పైచిలుకు ఉద్యోగాలు నా చెల్లెమ్మలే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

గతంలో మీ బిడ్డ ప్రభుత్వం రాకముందు, 58 నెలల కాలానికి ముందు మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా ప్రభుత్వ పథకాలు మీకు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అందే పరిస్థితి ఉంటుందని చెప్పారా..? ఈరోజు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ, నా అక్కచెల్లెమ్మల మేలు జరిగిస్తూ ఏకంగా మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు, రూ.2.65 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి చేరాయి. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని ఆలోచన చేయండి. 

మీ కుటుంబ సభ్యులతో మీరంతా బ్యాంక్‌లకు వెళ్లండి.. బ్యాంకు మేనేజర్లను 10 సంవత్సరాల మీ ఖాతా స్టేట్‌మెంట్‌ ఇవ్వమని అడగండి.. 5 సంవత్సరాల చంద్రబాబు పాలన, 5 సంవత్సరాల మీ బిడ్డ పాలన.. ఆ స్టేట్‌మెంట్‌ చూసినప్పుడు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మీ అకౌంట్‌కు కనీసం ఒక్క రూపాయి అయినా వచ్చిందా చూడండి అని అడుగుతున్నా.. అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ అకౌంట్లోకి వచ్చాయో గమనించండి. 

ఎప్పుడూ జరగని మార్పు, ఎప్పుడూ చూడని విషయాలు ఈ 58 నెలల మీ బిడ్డ పాలనలో కనిపిస్తుంది. కాబట్టే లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్రరాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఈమధ్య కాలంలో కేంద్రం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి సాధికారత కోసం మనం ఇచ్చిన తోడ్పాటు, అక్కచెల్లెమ్మల స్వయంకృషి రెండూ కలవడంతో ఈరోజున అక్కచెల్లెమ్మలు లక్షాధికారులై, ప్రతి ఇంట్లో చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తున్నారు. 

మహిళా సాధికారత, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని మనసున్న ప్రభుత్వంగా మనం అమలు చేశాం. ఎన్నికలప్పుడు మాటివ్వడం, మేనిఫెస్టో అని రంగురంగు కాగితాలు చూపించడం, ఎన్నికల అయిపోయిన తరువాత దాన్ని చెత్తబుట్టలో పడేయడం కాదు.. ఆ పరిస్థితులను మార్చి విశ్వసనీయత అనే పథకానికి అర్థం చెబుతూ.. ఎన్నికల్లో ఏదైతే చెప్పామో, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో, ప్రజల ముందుకు ఏదైతే తీసుకువెళ్లామో, ఆ ఇచ్చిన ప్రతి హామీలను కూడా ఏకంగా 99 శాతం నెరవేర్చి, అక్కచెల్లెమ్మలకు చూపించి ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

మరోపక్క మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు వీరిద్దరి పేరుచెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకు వస్తుంది. చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు సీఎంగా అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు గుర్తుకువస్తాయి. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకువస్తుంది. విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకువస్తాడు. దత్తపుత్రుడు పేరు చెబితే.. వివాహ వ్యవస్థకే ఓ కళంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకువస్తాయి. కార్లుమార్చినట్లుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడు అని గుర్తుకువస్తుంది.

వీరిద్దరూ కలిసి 2014 ఇంటింటికీ పంచిన మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో గుర్తుకుచేసుకుందాం.. 

రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని వాగ్దానం ఇచ్చారు. అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తామని వాగ్దానం చేశారు. మోసపు ప్రకటనలు చేశారు. ప్రతి ఇంటికి ఏటా 12 గ్యాస్‌ సిలిండర్ల మీద రూ.100 చొప్పున సంవత్సరానికి రూ.1200, ఐదు సంవత్సరాల్లో 6 వేల రూపాయల సబ్సిడీ ఇస్తామని 2014 మేనిఫెస్టోలో బాబు–దత్తపుత్రుడు చెప్పారు. మహిళల రక్షణ కోసం ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు బ్యాంక్‌ డిపాజిట్‌ చేస్తామని మహాలక్ష్మి అని అమ్మవారి పేరు కూడా పెట్టారు. మొదటి సంతకంతోనే బెల్ట్‌షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. పండంటి బిడ్డ అనే పథకం ద్వారా పేద గర్భిణులకు రూ.10 వేలు ఇస్తామని 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు–దత్తపుత్రుడుlకలిసి చెప్పారు. బడికి వెళ్లే ఆడపిల్లలకు సైకిల్‌ ఇస్తామన్నారు. ప్రతి అక్కచెల్లెమ్మకు స్మార్ట్‌ ఫోన్‌ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు కుటీర లక్ష్మి అని మరో పథకం అమలు చేస్తామని ఇంకో వాగ్దానం చేశారు. 2014 ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి వారి ఫొటోలు పెట్టి, సంతకాలు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానమైన చంద్రబాబు– దత్తపుత్రుడు అమలు చేశాడా..? 

చంద్రబాబు, దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి 2014లో మేనిఫెస్టో అని చెప్పి నమ్మిన అక్కచెల్లెమ్మలను నట్టేట ముంచి, ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా ఎగ్గొట్టారు. అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేశారు. పైగా అప్పటి వరకు అమలులో ఉన్న సున్నావడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్‌ 2016 నుంచి రద్దు చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బాబు విడిపిస్తాడని నమ్మి, డబ్బు కట్టని అక్కచెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే ఇదే చంద్రబాబు చోద్యం చూస్తూ నిలబడ్డాడు కానీ, వారిని ఆదుకోవాలనే ఆలోచన కూడా రాలేదు. 

12 గ్యాస్‌ సిలిండర్ల మీద సంవత్సరానికి రూ.1200 సబ్సిడీ, ఐదేళ్లలో రూ.6 వేల సబ్సిడీ అన్న వీరు అక్కచెల్లెమ్మలకు సబ్సిడీ మీద ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు.

ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయలేదు, చేయకపోగా.. విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ను వీరి జాయింట్‌ ప్రభుత్వం దుర్మార్గంగా నడిపించి అక్కచెల్లెమ్మల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. 

ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తామన్న వీరు మీలో ఏ ఒక్కరికైనా, మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్‌ చేశారా..? 

చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువచ్చేది మోసం, దగా. చివరకు వీరు అమ్మవారి పేరును కూడా ఆటవస్తువుగా ఉపయోగించుకున్నారు. ప్రతి పథకానికి మహాలక్ష్మి, కుటీర లక్ష్మీ అని అమ్మవారి పేరు పెట్టి మోసం చేసిన వీరు మళ్లీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ.. ఈరోజు మళ్లీ మహాశక్తి అని మోసానికి తెరదీస్తున్నారు. 

బిడ్డపుడితే ఇస్తామన్నది మోసం, గర్భిణులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం, బడికి వెళ్లే ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం, ఇల్లాలుకు ఇస్తామన్న సిలిండర్ల సబ్సిడీ ఇంకో మోసం, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చేస్తామన్న రుణమాఫీ దారుణమైన మోసం, బెల్ట్‌షాపులు రద్దు అని చెప్పి ఎక్కడబడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం, అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి రెండు నెలలు మాత్రమే పెన్షన్‌ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజ మోసం. పెన్షన్‌ కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చింది రూ.1000, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రం అవ్వలను సైతం మోసం చేసేందుకు రూ.2 వేలు చేసి.. ఇవాళ ఎక్కడబడితే అక్కడ ఊదరగొడుతున్నారు. 

ఇలా కడుపులో ఉన్న బిడ్డ మొదలు, పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్కచెల్లెమ్మలందరికీ కూడా చంద్రబాబు, దత్తపుత్రుడు చేసిన మోసం, దగా ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. 

మళ్లీ అక్కచెల్లెమ్మలకు ఇంటింటికీ ఇంతిస్తామని, బీసీ అక్కచెల్లెమ్మలకు ఇంకా ఎక్కువ ఇస్తామని, మళ్లీ కొత్త అబద్ధాలు, కొత్త మోసాలు చంద్రబాబు, దత్తపుత్రుడు మొదలు పెట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారు. 2014 మేనిఫెస్టోలో ఇదే చంద్రబాబు, దత్తపుత్రుడు బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేశాడు. దీంట్లో అమలు చేసింది గుండుసున్నా.. 

సామాజిక వర్గాలు, అక్కచెల్లెమ్మలు చంద్రబాబు, దత్తపుత్రుడిని నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే. వీరిని నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అనేది ప్రతి అక్కచెల్లెమ్మ ఆలోచన చేయాలి. ఫలానా మంచి చేశాం కాబట్టి, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్నాం కాబట్టి, ఇదే మంచి మరోసారి చేస్తామని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి చంద్రబాబు, దత్తపుత్రుడికి లేదు. చంద్రబాబు పేరు చెప్పినా, ఆయన పాలన గురించి అడిగినా గుర్తుకువచ్చే ఒక్కటంటే ఒక్క మంచి లేదు, ఒక్క స్కీము లేని పాలన చంద్రబాబు పాలన. 

రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు అమలు చేస్తున్న కార్యక్రమం మహిళా పక్షపాత ప్రభుత్వంగా, ఈ 58 నెలల్లో ఏం చేశామో మీ అందరి ముందు వివరించా. ఇదీ మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు మంచి చేయడానికి ముందుకువచ్చే ప్రభుత్వం. 

రాబోయే రోజుల్లో ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా నమ్మొద్దు. మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి చంద్రబాబు, దత్తపుత్రుడు మీ దగ్గరకు వచ్చి కేజీ బంగారం, ప్రతి ఇంటికి బెంజ్‌ కారు కొనిస్తామని చెబుతారు. దత్తపుత్రుడు, చంద్రబాబు సంతకాలు చేసిన పేపర్‌ మీ దగ్గరకు వస్తుంది.. కానీ ఆలోచన చేయండి ఎవరి వల్ల మంచి జరిగింది. ఎవరు మంచి చేస్తారు, ఎవరు మాట మీద నిలబడతారు, ఎవరికి విశ్వసనీయత ఉందనేది మాత్రం మరిచిపోవద్దు. 

మీ బిడ్డ మీ అందరి దగ్గర నుంచి కోరేది ఒక్కటే. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మంచి జరిగిందంటే మాత్రం మీరంతా మీ బిడ్డకు సైనికులుగా, స్టార్‌ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలని కోరుతున్నాను. చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకేస్తూ ప్రయాణం చేస్తున్నాడు. ఈ మార్పు తీసుకురావడం కోసం మీ బిడ్డకు దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి దీవెనలు, మీ ఆశీస్సులు మీ బిడ్డపై, మీ బిడ్డ ప్రభుత్వంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. 
 

Best Web Hosting Provider In India 2024