YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.23-12-2022(శుక్రవారం) ..
ప్రజల దీవెనలే వైయస్ జగన్ మోహన్ రెడ్డి బలం ..
కమ్మవారిపాలెం గ్రామంలో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని కమ్మవారిపాలెం గ్రామంలో శుక్రవారం ఉదయం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల క్యాలెండర్ ను అందజేస్తూ – ప్రభుత్వ పనితీరును వివరించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపలోను సంక్షేమం ఆనందం వెల్లివిరస్తోందని , ప్రజల ఆశీస్సులే ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న బలం అని చెప్పారు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు , సంక్షేమ పథకాల పట్ల ప్రతి గడపలో 100% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు ,ప్రతి ఇంట మహిళలు గడిచిన మూడేళ్లలో మా ఇంటికి రూ.లక్షల్లో లబ్ధి చేకూరిందని చెబుతున్నారన్నారు , అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తున్నామని , దాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పనికిమాలిన మాటలతో బురద చల్లుతున్నాయని మండిపడ్డారు , ప్రజలందరికీ అన్ని విధాలుగా మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మనసారా దీవించాలని కోరారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంటమాల నిర్మల, రాజేంద్ర, మాజీ సర్పంచ్ వేల్పుల కిషోర్, చండ్ర కోటేశ్వరరావు ,జంపాని సుబ్బారావు, సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..