YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు మండలం :
ది.23-12-2022(శుక్రవారం) ..
ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ..
విభరింతలపాడు గ్రామంలో వాటర్ లైన్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
చందర్లపాడు మండలంలోని విభరింతలపాడు గ్రామంలో రూ.8 లక్షల అంచనా విలువతో “జల జీవన మిషన్” ద్వారా ఇంటింటికి కుళాయి పథకంలో భాగంగా చేపట్టనున్న వాటర్ లైన్ ఏర్పాటు పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శుక్రవారం శంకుస్థాపన నిర్వహించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని అందించటమే జలజీవన్ మిషన్ లక్ష్యమని ,జలజీవన్ మిషన్ ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్లు అందిస్తామని తెలిపారు ,పనులను త్వరితగతిన పూర్తి చేసి తాగునీటిని సరఫరా చేయాలని కాంట్రాక్టర్లకు- అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సూచించారు , పైపులైన్ల ఏర్పాటు పనులను స్థానిక ప్రజాప్రతినిధులు -పార్టీ నాయకులు దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ -మండల పార్టీ కన్వీనర్ లు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ..