బాబు, ప‌వ‌న్‌, లోకేష్‌ల‌పై ఈసీకి ఫిర్యాదు

Best Web Hosting Provider In India 2024

అమ‌రావ‌తి: ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నచంద్రబాబు,పవన్ కల్యాణ్,లోకేష్ ల పై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిన  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లీగల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మనోహర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ జగన్ గారిపై విషప్రచారం చేస్తున్న చంద్రబాబు,పవన్ కల్యాణ్,నారాలోకేష్ లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ ను కోరారు.

చంద్రబాబునాయుడు ఒంగోలు,మార్కాపురంలలో జగన్ గారిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆప్ కాండక్ట్ కు విరుధ్ధం.దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాయింట్స్ 

మార్కాపురం ,ఒంగోలు సభల్లో సీఎం వైయ‌స్‌ జగన్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసారు.చంద్రబాబుకు జగన్ పై అసూయ తారా స్థాయికి చేరింది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు అండ్ కో విషం చిమ్ముతోంది.ఐటీడీపి సైట్ లో విషప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు ,పవన్ విలువలు ,విశ్వసనీయత కోల్పోయారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.మా ఫిర్యాదుపై ఈసీ స్పందించింది.

Best Web Hosting Provider In India 2024