మాచ‌ర్ల‌లో టీడీపీ గూండాయిజం.. పిన్నెల్లి స‌తీమ‌ణికి గాయాలు

Best Web Hosting Provider In India 2024

పల్నాడు: పల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి తెగ‌బ‌డ్డారు. వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో వైయ‌స్ఆర్ సీపీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్లు దాడికి దిగారు. వైయ‌స్ఆర్ సీపీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. అదే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై కూడా దాడి చేసి.. వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డకున్న వెల్దుర్తి ఎస్‌ఐ శ్రీహరిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.

Best Web Hosting Provider In India 2024