Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని.. ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారన్నారు.ప్రజలు ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు సానుకూల ఓటుతో క్యూ కట్టారు. ఇంకా పోలింగ్ బూత్ల దగ్గర క్యూలైన్లో ఓటర్లున్నారని సజ్జల అన్నారు.
చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో టీడీపీ నేతలు ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు, గూండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. అద్దంకి, పీలేరు, సత్తెనపల్లిలో హింసాకాండకు పాల్పడ్డారు. టీడీపీ మూకలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఈవీఎంలు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారు. పేద ప్రజల అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధికి దారి తీస్తుందని సజ్జల చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం అండతో పోలింగ్ డే వరుకూ టీడీపీ నాటకాలు, దాడులు అన్ని చూశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కూడా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..
- ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా కనిపిస్తోంది
- ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు
- ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు సానుకూల ఓటుతో క్యూ కట్టారు
- సీఎం వైయస్ జగన్ పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారు
- పేద ప్రజల అభివృద్ధే..రాష్ట్రాభివృద్ధికి దారి తీస్తోంది
- ప్రజలు ఓటు వేసేందుకు వెల్లువెత్తారు
- చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో టీడీపీ నేతలు దాడులు ప్రారంభించారు
- టీడీపీ మూకలు రిగ్గింగ్కు పాల్పడ్డారు..ఈవీఎంలు ధ్వంసం చేశారు
- టీడీపీ గుండాలు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడులు చేశారు
- వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారు
- అద్దంకి, పీలేరు, సత్తెనపల్లి, పెనుమలూరులో హింసాకాండకు పాల్పడ్డారు
- టీడీపీ అరాచకాలపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కూడా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు
- కేంద్ర ప్రభుత్వ అండతో పోలింగ్ డే వరకూ టీడీపీ నాటకాలు, దాడులు అన్ని చూశాం