సునామీలా త‌ర‌లివ‌చ్చిన ప్ర‌తిఒక్క‌రికీ పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు

Best Web Hosting Provider In India 2024

 

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. పోలింగ్‌లో పాల్గొని ఓటు హ‌క్కు వినియోగించుకున్నవారికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు. “నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మన వైయస్‌ఆర్‌సీపీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను“ అని సీఎం ట్వీట్ చేశారు.

Best Web Hosting Provider In India 2024